శ్రేయస్ అయ్యర్ బౌలింగ్.. షాకైన విరాట్ కోహ్లీ?

praveen
శ్రేయస్ అయ్యర్.. ఇటీవల కాలంలో భారత జట్టులో నిలకడైన బ్యాటింగ్ తీరుతో ఇక తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఆటగాడు. అంతేకాదు ఇక గత ఏడాది క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా కూడా శ్రేయస్ అయ్యర్ రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో నిలకడైన ఆట తీరుకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన అయ్యర్.. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగులు చేస్తూనే వస్తున్నాడు అని చెప్పాలి. అయితే సాధారణంగా జట్టులో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లుగా కొనసాగుతున్న వారు ఎక్కువగా అటు బౌలింగ్ జోలికి అస్సలు పోరు అనే విషయం తెలిసిందే..
 కేవలం ఆల్రౌండర్లు మాత్రమే అటు బ్యాటింగ్ లో అదరగొట్టడమే కాదు ఇక బౌలింగ్ కూడా చేయడం చూస్తూ ఉంటాం. కానీ కొన్ని కొన్ని సార్లు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్లు సైతం బౌలింగ్ వేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటిది ఏదైనా జరిగిందంటే చాలు అభిమానులు ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు అని చెప్పాలి. మొన్నటికి మొన్న పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ సైతం ఓ మ్యాచ్ లో ఇలా బౌలర్గా అవుతారమెత్తి ప్రత్యర్థిలపై బంతులు సంధించాడు. ఇక ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్లో సైతం అటు భారత జట్టులో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న శ్రేయస్ అయ్యర్ బౌలర్గా అవతారమెత్తాడు అని చెప్పాలి.

 అంతే కాదు తన బౌలింగ్ ప్రతిభతో ఏకంగా విరాట్ కోహ్లీని సైతం ఆశ్చర్యానికి గురిచేసాడు అని చెప్పాలి. శ్రీలంక ఇన్నింగ్స్ లో 18వ ఓవర్ వేసేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ చేతికి బంతిని అందించాడు. ఈ క్రమంలోనే ఆఫ్ స్పిన్ వేసేందుకు సిద్ధమైన శ్రేయస్ అయ్యర్ బంతిని తన స్పిన్ తో అద్భుతంగా టర్న్ చేశాడు. దీంతో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ షాక్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక మూడో మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా 3-0 తేడాతో అటు శ్రీలంకను క్లీన్ స్వీప్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: