IND VS SL: భారీ షాక్‌.. వన్డే సిరీస్‌ నుంచి బుమ్రా ఔట్‌..?

Purushottham Vinay
పొరుగు దేశం శ్రీ లంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియా వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని ట్రై చేస్తుంది.ఇక గౌహతి వేదికగా రేపు(జనవరి 10) ఫస్ట్ వన్డే జరగనుంది.అయితే ఈ సిరీస్‌ కి ప్రకటించిన జట్టులో టీమిండియా స్పీడ్‌స్టర్‌ జస్‌ప్రీత్ బుమ్రాకు ప్లేస్ కల్పించింది బీసీసీఐ. సుమారు 4 నెలల నుంచి జట్టుకు దూరంగా ఉన్న బుమ్రా వస్తే బౌలింగ్‌ చాలా పటిష్ఠంగా మారుతుందని భావించింది. అయితే ఫస్ట్ మ్యాచ్‌కు ముందే భారత జట్టుకు పెద్ద షాక్‌ తగిలింది. ఫిట్‌నెస్‌ లేని కారణంగా బుమ్రాను జట్టుకు దూరంగా ఉంచాలని బీసీసీఐ కీలక ప్రతినిధి ఒకరు తెలిపారు. బుమ్రా ఫిట్‌నెస్‌ విషయంలో ఎలాంటి తొందరపాటు డెసిషన్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఈ కారణం వల్ల టీమిండియా ప్లేయర్స్ గౌహతికి చేరుకున్నా బుమ్రా ఇంకా ఎన్‌సీఏలోనే ఉండిపోయాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా సెప్టెంబర్ 2022 నుండి క్రికెట్ ఫీల్డ్‌కు దూరంగా ఉన్నాడు. వెన్నుకి గాయం కావడం వల్ల టీ20 ప్రపంచ కప్  ఆడలేకపోయాడు.


ఇక దీని తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఎన్‌సీఏ కూడా బుమ్రా బాగానే ఫిట్‌గా ఉన్నాడని ప్రకటించింది. దీంతో టీమిండియా  సెలక్టర్లు కూడా వెంటనే బుమ్రాని శ్రీలంకతో వన్డే జట్టులో చేర్చారు. అయితే మున్ముందు కీలక సిరీస్‌లు ఉన్న కారణంగా బుమ్రా ఫిట్‌నెస్‌ విషయంలో తొందరపడకూడదని టీం మేనేజ్‌మెంట్ భావిస్తోంది.ఇక ఈ ఏడాది టీమిండియా ఆస్ట్రేలియాతో 4 టెస్టుల సిరీస్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌ ని కూడా ఆడాల్సి ఉంది. అలాగే మరోవైపు, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కూడా చాలా ముఖ్యం. అయితే త్వరలో జరిగే న్యూజిలాండ్‌ టీంతో వన్డే, టీ20 సిరీస్‌లలో బుమ్రా ఆడవచ్చని సమాచారం తెలుస్తుంది. జనవరి 18 వ తేదీ నుంచి సిరీస్ స్టార్ట్ కానుంది. దీని తర్వాత ఇండియన్ టీం ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది. అలాగే లంకతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న సీనియర్లు రోహిత్‌ శర్మ, వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి ఇంకా అలాగే శ్రేయస్‌ అయ్యర్‌ ఇప్పటికే గౌహతికి చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: