పాపం పంత్ కి విశ్రాంతి లేకుండా చేస్తున్నారుగా?

Purushottham Vinay
ఇక రోడ్డు ప్రమాదంలో చాలా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ ఇప్పుడిప్పుడే జరిగిన ప్రమాదం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాడు. తాజాగా పంత్ ని వైద్యులు ఐసీయూ నుంచి ప్రైవేట్ సూట్‌కు తరలించడం జరిగింది.అతనికి ఇన్ఫెక్షన్ సోకకూడదనే ఉద్దేశంతోనే డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు.ప్రస్తుతం రిషబ్ పంత్ బాగానే కోలుకుంటున్నట్లు, ఆదివారం నాడు సాయంత్రం పంత్‌ను ప్రైవేటు వార్డుకు షిఫ్ట్ చేసినట్లు శర్మ చెప్పారు. ప్రస్తుతం పంత్ డెహ్రడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఆయనకు చికిత్స చేసే విషయంలో పూర్తి సహాయం చేస్తామని ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ప్రకటించారు. ఆదివారం నాడు పుష్కర్ సింగ్ ధామి ఆస్పత్రిలో పంత్‌ను పరామర్శించడం జరిగింది. రిషబ్ పంత్ చికిత్స విషయంలో బీసీసీఐ కూడా స్పందించింది. రిషబ్ పంత్ చికిత్స పొందుతున్న ఆస్పత్రి వర్గాలతో బీసీసీఐ కూడా చర్చించడం జరిగింది.


పంత్ నుదురు భాగం, కుడి మోకాలు, కాలి లిగ్మెంట్ వద్ద బాగా గాయాలయ్యాయి. అర్జంట్ అయితే ఈ గాయాలకు చికిత్స కోసం పంత్‌ను విదేశాలకు తరలించే అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు రిషబ్ పంత్‌ను పరామర్శించేందుకు వీఐపీలు చాలా ఎక్కువగా వస్తున్నారు.దీంతో పంత్ విశ్రాంతి తీసుకునేందుకు కూడా సమయం ఉండటం లేదని పంత్ కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.పంత్ కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు, క్రీడాకారులు, అధికారులు ఇంకా నటులు వస్తుండటంతో అతడికి విశ్రాంతి అనేది కరువైందని పంత్ కుటుంబ సభ్యులు తెలిపారు. అది కూడా సందర్శన వేళలతో సంబంధం లేకుండా రిషబ్ పంత్‌ను చూసేందుకు వస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలంటే అతడు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యమని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం పంత్ గాయాల వల్ల కలిగిన నొప్పితో చాలా ఎక్కువగా బాధ పడుతున్నాడని, ఇంకా అలాగే సందర్శకులతో మాట్లాడటం వల్ల అతడు చాలా శక్తిని కోల్పోవాల్సి వస్తోందని, మరింత స్ట్రెస్ కి గురవుతున్నాడని డాక్టర్ లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: