హ్యాపీ బర్త్ డే: ఒకేరోజు నలుగురు క్రికెటర్ల పుట్టినరోజు!

Purushottham Vinay
ఒక స్టార్ సెలబ్రిటీ పుట్టినరోజు జరుపుకుంటే సోషల్ మీడియాలో హావా మాములుగా ఉండదు. అందులోనూ స్టార్ క్రికెటర్ పుట్టినరోజు జరుపుకుంటేనే సోషల్ మీడియాలో అసలు మాములు హడావిడి ఉండదు. అలాంటిది ఒకేరోజు టీమిండియాకు చెందిన నలుగురు స్టార్ క్రికెటర్లు పుట్టినరోజు జరుపుకుంటే సోషల్ మీడియాలో జరిగే హంగామా అసలు అంతా ఇంతా కాదనే చెప్పాలి.తాజాగా  మంగళవారం నాడు అంటే డిసెంబర్ 6వ తేదీన ఏకంగా నలుగురు క్రికెటర్లు తమ బర్త్ డే లను జరుపుకుంటున్నారు. వారే పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, శ్రేయాస్ అయ్యర్ ఇంకా అలాగే టెస్టు స్పెషలిస్టు కరుణ్ నాయర్ ఈరోజు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా నెటిజన్‌లు వారికి ఎన్నో రకాలుగా తమ విషెస్ తెలుపుతున్నారు.ఇక వీరిలో బుమ్రా 29వ బర్త్ డే జరుపుకుంటుండగా జడేజా 34వ బర్త్ డే ఇంకా అలాగే శ్రేయాస్ అయ్యర్ 28వ బర్త్ డే, కరుణ్ 32వ బర్త్ డే జరుపుకుంటున్నారు.


దీంతో బీసీసీఐ కూడా ఆయా ఆటగాళ్లకు ప్రత్యేకంగా విషెస్ ని తెలియజేయడం జరిగింది. ఇక పలు గాయాల కారణంగా బుమ్రా, జడేజా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్నారు. వీళ్లిద్దరూ కూడా టీ20 ప్రపంచకప్ ఆడలేదు. అయితే జడేజా మాత్రం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇక శ్రేయాస్ అయ్యర్ వన్డే జట్టులో ఎంతో కీలకంగా రాణిస్తూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. వచ్చే సంవత్సరం వన్డే ప్రపంచకప్‌లో శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడే కర్చీఫ్ వేసినట్లు సమాచారం అనేది తెలుస్తుంది. అటు టెస్టు స్పెషలిస్ట్ అయిన కరుణ్ నాయర్ భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు.అజింక్య రహానె ఇంకా అలాగే పుజారా రిటైర్మెంట్ దగ్గర పడిన నేపథ్యంలో కరుణ్ నాయర్‌కు అవకాశం లభిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: