హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం?
అయితే మొన్నటికి మొన్న ఈ రెండు దేశాలు మధ్య టి20 మ్యాచ్ జరిగగా.. ఇక ఇప్పుడు మాత్రం టెస్ట్ జరగ బోతుంది అనేది తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి మధ్య లో బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం భారత్కు ఆస్ట్రేలియా జట్టు రానుంది. ఈ క్రమం లోనే నాలుగు టెస్ట్ లు జరగ బోతున్నాయ్. అయితే ఇందులో ఒక మ్యాచ్ ఢిల్లీ వేదిక గా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన మ్యాచ్ ల నిర్వహణ కోసం అహ్మదాబాద్, ధర్మశాల, నాగపూర్, చెన్నై, హైదరాబాద్ వేదికలను కూడా పరిశీలిస్తుందట భారత క్రికెట్ నియంత్రణ మండలి.
ఇప్పుడు వరకు కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చిన ధర్మశాలలో నాలుగు టెస్ట్ మ్యాచ్లలో రెండో టెస్ట్ కి వేదికగా నిలవచ్చు అన్నది తెలుస్తుంది. ఇక అదే సమయంలో ఇక 4 టెస్టులలో ఒక మ్యాచ్ ని హైదరాబాద్ వేదికగా నిర్వహించబోతున్నారు అని చెప్పాలి. దీంతో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ అందరుఎంతో సంతోష పడిపోతున్నారు.