జింబాబ్వేతో సిరీస్ లో అదరగొట్టాడు.. ప్రమోషన్ వచ్చేసింది?
అయితే అతన్ని కొన్ని రోజులలో జరగబోయే ఆసియా కప్లో భాగంగా స్టాండ్బై ప్లేయర్గా బీసీసీఐ ఎంపిక చేసింది. అతని ఫామ్ నిరూపించుకునేందుకు ఇటీవల జింబాబ్వే పర్యటనలో టీమిండియా ఆడిన వన్డే సిరీస్కు ఎంపిక చేసింది అన్న విషయం తెలిసిందే. ఇటీవల జింబాబ్వేతో జరిగిన సిరీస్లో భాగంగా అద్భుతమైన పునరాగమనం చేశాడు. రెండు మ్యాచ్లలో ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో అతని ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని అతనికి ఆసియా కప్ లో తుది జట్టులో అవకాశం కల్పించాలని బిసిసీఐ భావిస్తోందట.
ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీపక్ చాహర్ ఆసియాకప్ ప్రధాన జట్టులోకి చేరడం ఖాయం.. అతను కొంతకాలం నుంచి జట్టుకు దూరమైనప్పటికీ అతని ఫామ్ ఏ మాత్రం కోల్పోలేదు. దీపక్ చాహర్ పవర్ ప్లే లో ఒకటి రెండు వికెట్లు పడగొట్టి జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించగలడు. కాబట్టి టీ20 జట్టును ఎంపిక చేసే ముందు అతనికి ప్రాధాన్యత ఎక్కువ ఉండాలి అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం బుమ్రా, మహమ్మద్ షమీ లాంటి వాళ్లు అందుబాటులో లేకపోవడంతో వారి స్థానాన్ని దీపక్ చాహర్ భర్తీ చేయగలడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు మాజీ ఆటగాడు లక్ష్మీపతి బాలాజీ.