అతను లేకపోయింటే.. నా కెరియర్ ముగిసేది : సెహ్వాగ్
ఇకపోతే ఇటీవల ఒక క్రీడా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. 2007 - 2008 సీజన్లో భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ సందర్భంగా జరిగిన ఘటన వీరేంద్ర సెహ్వాగ్ గుర్తుచేసుకున్నాడు. కష్ట సమయాల్లో తనకు అప్పటి కెప్టెన్ అనిల్ కుంబ్లే అండగా నిలిచాడు అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో సెలెక్టర్లు తరచూ నన్ను పక్కన పెడుతూ వస్తున్నారు. దీంతో రెండో టెస్ట్ జట్టులో సుదీర్ఘమైన ఫార్మాట్లో పదివేలకు పైగా పరుగులు చేయాలని నా కోరిక. జట్టు నుంచి ఉద్వాసన ఉండకూడదని ఎప్పుడు ఆశ పడుతూ ఉండేవాడిని.
ఆస్ట్రేలియా సిరీస్ లో రెండు టెస్టుల్లో భారత్ ఓడిన తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు వీరేంద్ర సెహ్వాగ్. ఆ తర్వాత టీమిండియా అద్భుత విజయం సాధించింది. నిన్న జరిగిన వార్మప్ మ్యాచ్లో 50 కొడితే జట్టులో స్థానం కల్పిస్తామని కెప్టెన్ అనిల్ కుంబ్లే చెప్పాడు అంటూ గుర్తు చేసుకున్నారు. అడిలైడ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 63 సాధించాడు. ఆ తర్వాత జరిగిన సెకండ్ ఇన్నింగ్స్ లో వీరవిహారం చేసి 151 పరుగులు సాధించాడు. కాగా తొలి ఇన్నింగ్స్ లో చేసిన 63 పరుగులే జీవితంలో అత్యంత కష్టతరమైనవీ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో అనిల్ కుంబ్లే మద్దతు లేకపోతే నా కెరీర్ ముగిసిపోయేది అని తెలిపాడు.