ఎలక్ట్రికల్ వెహికల్స్ పేలుడుకి కారణాలు ఇవే.. అందరూ తెలుసుకోండి?

praveen
ఇటీవలి కాలంలో దేశంలో పెట్రోల్ ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 120 రూపాయలకు పైగానే ఉంది. దీంతో సామాన్య ప్రజలు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్ బాధుడు నుంచి తప్పించుకోవడం ఎలా అనే ఆలోచనలో పడిపోయారు. ఈ క్రమంలోనే అందరికీ వస్తున్న ఒకే ఒక ఆలోచన ఎలక్ట్రికల్ బైక్ తీసుకుంటే ఎలా ఉంటుంది. హాయిగా పెట్రోల్ బాదుడుకు దూరంగా ఉండవచ్చు అని భావిస్తున్నారు. కానీ ఇటీవలి కాలంలో ఎలక్ట్రికల్ బైకులు వరుసగా పేలిపోతున్న ఘటనలు అందరినీ భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి.

 ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రమాదానికి గురైన కొన్ని ఘటనల్లో ఏకంగా వాహనదారులు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉండడం చూసి అందరూ ఆందోళన చెందుతున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలి అనే ఆలోచనను విరమించుకున్నారు చాలామంది. అయితే మరి కొంతమంది అసలు ఇలా ఎలక్ట్రికల్ వెహికల్స్ పేలి పోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయంపై వెతకడం ప్రారంభించారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ పేలుడుకు కొన్ని కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 ఎలక్ట్రికల్ వెహికల్స్ లోని లిథియం అయాన్ బ్యాటరీ లో దాదాపు 100 నుంచి 200 వరకు సెల్స్ ఉంటాయి. వాటి ప్యాకింగ్ విధానంలో తేడా ఉంటే ఇక పేలిపోయే ఛాన్స్ ఉంటుందట.
 ఇక బ్యాటరీ లోపల షార్ట్ సర్క్యూట్ జరగడం కూడా పేలుడుకు కారణం అని అంటున్నారు నిపుణులు.
 వైరింగ్ తప్పిదాలు ఫ్యూయల్ లైన్ లో తేడాలు కూడా ఈ పేలుడు కి కారణాలట.
 అంతేకాకుండా సమయానికి మించి ఛార్జింగ్ పెట్టడం కూడా పేలుడుకు కారణం అని అంటున్నారు.
 వాహనాన్ని కడిగిన వెంటనే ఛార్జింగ్ పెడితే అందులో సాకెట్లు దెబ్బతింటుందని ఇది కూడా ఒక కారణం అవుతుందని చెబుతున్నారు.
 ఇక విద్యుత్ లో హెచ్చుతగ్గులు కూడా బ్యాటరీ వేడెక్కడానికి కారణం అవుతుందట. తద్వారా పేలుడు సంభవిస్తుందట..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ev

సంబంధిత వార్తలు: