WTC ఫైనల్.. రేపు కూడా మ్యాచ్ కష్టమే.. ఆడితే ఇదే పరిస్థితి?

praveen
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రతి ఒక్కరు అందరికీ ఊహించని షాక్ తగిలింది.  మరి కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది అని అనుకున్న మ్యాచ్ చివరికి  వాయిదా పడింది.  ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ నిరాశ ఎదురైంది.  భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య నేటి నుంచి జూన్ 22వ తేదీ వరకు వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది.  కానీ మొదటి నుంచే వరుణ గండం ప్రేక్షకులందరిని భయపెట్టింది.

 దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న దానిపై సర్వత్రా అనుమానాలు నెలకొంది. ఇక  చివరికి అనుకున్నది జరిగింది.  సరిగ్గా కొన్ని నిమిషాల ముందు  ఫైనల్ మ్యాచ్ ప్రారంభం అవుతుంది అని  క్రికెట్ ప్రేక్షకులందరూ టీవీలు ముందు వచ్చి కూర్చున్నారు  కానీ అంత లో కాస్త వరుణ దేవుడు ప్రతాపం చూపించాడు.  దీంతో మరికొద్ది నిమిషాల్లో ప్రారంభమవుతున్న మ్యాచ్ కాస్త చివరికి మొదటి సెషన్ జరగకుండానే వాయిదా పడింది.  దీంతో సోషల్ మీడియా వేదికగా ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఎదురు చూసిన ప్రేక్షకులు అందరూ స్పందిస్తున్నారు.

 అంతే కాదు ఇక ఇటీవల సోషల్ మీడియా లో ఒక వీడియో వైరల్ గా మారిపోయింది.  గ్రామాల్లో ఉండే గల్లీ క్రికెటర్స్ అందరూ ఒక బురద మట్టి లో క్రికెట్ ఆడుతున్న వీడియో ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది. ఇక ఈ బురద మట్టిలో ఎక్కడికక్కడ జారి పడుతున్నప్పటికీ క్రికెట్ ఆడుతున్నారు.  ఇక ఇది చూస్తే నవ్వు తెప్పిస్తుంది. అటు వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ పరిస్థితి కూడా ఇలాగే మారిందని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.  వరుణదేవుడు కరుణించక పోతే  రేపు మ్యాచ్ జరిగేది కూడా చాలా కష్టమే అని చెబుతున్నారు విశ్లేషకులు.  ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: