ధోని తన మీద తానే సెటైర్స్..వైరల్ !!

KISHORE
మహీంద్ర సింగ్ ధోని ప్రపంచ క్రికెట్ లో కెప్టెన్ గా తనకంటూ చిరస్థాయి గుర్తింపు పొందాడు. అటు బ్యాట్స్ మెన్ గాను,కెప్టెన్ గాను,ధోని ఎంత మేటి ఆటగాడో అందరికీ తెలుసు. అయితే గత ఏడాది ఆగష్టు లో క్రికెట్ కు గుడ్ బై చెప్పి అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేశాడు. అయితే తాను క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత రాంచీ శివార్లలోని శంబో గ్రామంలోని తన 43 ఎకరాల ఫామ్‌ హౌస్‌లో ధోనీ 10 ఎకరాల్లో టమోటా, క్యాబేజీ, బొప్పాయి, ఇతర పంటలను పండిస్తూ రైతుగా మారి ఫుల్ బిజీగా మారిపోయాడు.
 తాజాగా శుక్రవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన తోటలో పండిన స్ట్రాబెరీని రుచి చూస్తూ  వీడియోనూ షేర్‌ చేశాడు. కాగా ఆ వీడియోకు ధోని పెట్టిన క్యాప్షన్‌ ఇప్పుడు సోషల్ మీడియా లో  విపరీతంగా వైరల్‌ అవుతుంది. ఇంతకీ ధోని పెట్టిన క్యాప్షన్‌ ఏంటంటే.. ' నా పొలంలోని స్ట్రాబెరీలను నేను తినడం మొదలుపెడితే మార్కెట్‌కు ఒక్క పండు కూడా వెళ్లేలా లేదు' అంటూ తన మీద తానే సెటైర్ వేసుకుంటూ పోస్ట్ పెట్టాడు.
 ప్రస్తుతం ఈ పోస్ట్ చూసిన ధోని ఫ్యాన్స్ "నువ్వు ఎందులోనైనా కెప్టెన్ వే.." అంటూ సోషల్ మీడియా లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ధోనీ ఫామ్‌ కూరగాయలకు స్థానికంగా మంచి డిమాండ్‌ రావడంతో వీటిని గల్ఫ్‌లో మార్కెట్‌ చేసేందుకు ఫామ్‌ ఫ్రెష్‌ ఏజెన్సీతో జార్ఖండ్‌ వ్యవసాయ శాఖ ధోని తో సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.అయితే క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని ఐ‌పి‌ఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. అయిన గత ఏడాది జరిగిన ఐ‌పి‌ఎల్ లో మాత్రం మునుపటి సత్తా చూపలేక పోయాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: