ధోనితో అలా పిలిపించుకోవడం మిస్ అవుతున్న : చాహల్

Kothuru Ram Kumar

చాహల్... టీమిండియా క్రికెట్ లో ప్రస్తుతం స్పిన్నర్ గా కొనసాగుతున్న వ్యక్తి. చూడటానికి చాలా పల్చగా ఉన్నా కంటెంట్ మాత్రం కాస్త ఎక్కువేనండోయ్... మనోడి దగ్గర. చాహల్ స్వతహాగా ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. అయితే అందులో టీమిండియా ప్లేయర్లందరి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాడు. అది ఆట పరంగా కానీ, ఏదైనా పర్సనల్ విషయం అయినా కానీ అన్ని రకాల వీడియోలను చాహల్ అప్లోడ్ చేస్తూ ఉంటాడు.


నిజానికి చాహల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అంతేకాదు బయట కూడా తను యాక్టివ్ గా ఉండటమే కాకుండా తన సహచరులు కూడా ఎప్పుడూ ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అయితే చాహల్ ధోనీతో చాలా సరదాగా ఉంటాడు. వారిద్దరూ మైదానంలోగాని బయటగాని చాలా సరదాగా ఉండటం జరుగుతుంటుంది. అయితే చాహల్ తాజాగా ధోనిని తాను ఎంత మిస్ అవుతున్నానో అంటూ చాహల్ తెలిపాడు. ఇటీవల ఇంస్టాగ్రామ్ లైవ్ లో మీరు ఒకవేళ మాయమైపోతే ముందు ఎక్కడికి వెళ్తారు అనే ప్రశ్నకు ఒక ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. చాహల్ ఏమని చెప్పాడు అంటే మొదటగా రాంచి కి వెళ్లి ధోనిని కలుస్తానని తెలిపాడు. అయితే తాజాగా విజయేంద్ర జోహార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఇంతకుముందు ధోనీతో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ తిల్లీ అని పిలిపించుకోవడం చాలా మిస్ అవుతున్నాను అని పోస్టులో పెట్టాడు. 


మహేంద్ర సింగ్ ధోనీతో వికెట్ల వెనుక నుంచి తిల్లీ అని పిలవడాన్ని నేను మిస్ అవుతున్నాను అని పేర్కొన్నాడు అయితే గత సంవత్సరం ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్ తర్వాత ధోనీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఐపీఎల్ తో మళ్లీ మైదానంలోకి తన విశ్వరూపాన్ని చూపించాలి అనుకున్నా కరోనా మహమ్మారి కారణంగా ఆ టోర్నీ వాయిదా పడుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: