ఆన్లైన్ లో చహల్ ని ఓ ఆటాడుకున్న బుమ్రా, రోహిత్ శర్మ...!

Suma Kallamadi

కరోనా పుణ్యమా అని టీమిండియా ప్లేయర్లందరూ ఇంట్లోనే ఉంటూ వారి కుటుంబ సభ్యులతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఊరికే ఉండలేకుండా మధ్య మధ్యలో వీరిలో కొంతమంది ఆన్లైన్ లోకి వస్తున్నారు. వారి వారి ఫాన్స్ ని పలకరించే క్రమంలో కొన్ని ఫన్నీ సన్నివేశాలు ఎదురవుతున్నాయి. ఇక విషయానికి వస్తే ... ఈ మద్య టీమిండియా ప్లేయర్లు బుమ్రా, రోహిత్ శర్మ ఆన్లైన్ లో ఏదో విషయం గురించి మాట్లడుకుంటున్నారు. ఆ విషయమేమిటంటే వీరిద్దరూ ఐపీల్ లో ముంబై ఇండియన్స్ తరుపుగా ఆడుతారు. కాబట్టి ముంబై ఇండియాన్స్ జట్టు గురించి ఏదో కాస్త సీరియస్ గానే మాట్లడుకుంటున్నారంటా. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే వీరిద్దరి మధ్యలోకి టీమిండియా స్పిన్నర్ చహల్ ఎంటర్ అయ్యాడు. ఇక అక్కడ అసలు విషయం మొదలైంది.

 

 


మామూలుగానే చహల్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడంటే ఎక్కడ పూర్తిగా కామెడీ మూడ్ లోకి మార్చేస్తాడు అందరిని. అయితే ఇక్కడ కూడా కామిడీ పండింది కానీ, అది తిరిగి చౌహాల్ మీద కావడంతో దెబ్బకి షాక్ అయ్యి కూర్చున్నాడు. అసలు ఏం జరిగిందంటే రోహిత్, బుమ్రా ఏదో విషయంపై మాట్లూడుతుంటే "బ్రదర్.. నేను లేనని ముంబై ఇండియన్స్ టీమ్ ఏమైనా బాధపడుతుందా?" అని ప్రశ్నించాడు. ఇక అంతే వెంటనే రోహిత్ అందుకొని "ఈ సంభాషణ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెబుతామని అతనికి చెప్పండని" చహల్‌ కి చెప్పనే చెప్పాడు హిట్ మ్యాన్.

 

 


ఆ తర్వాత బుమ్రా కూడా తనదైన శైలిలో "నువ్వు మళ్లీ ముంబై ఇండియన్స్‌కు రావాలనుకుంటున్నావని మీ కెప్టెన్ కోహ్లీకి చెబుతాం.. " హెచ్చరించాడు. అలా జరుగుతుండగానే రోహిత్ మేం గెలవకపోతే నువ్వు లేవని బాధపడాలి. కానీ మేం గెలిచాం. నువ్వు లేవని బాధపడాల్సిన అవసరం మాకు లేదు. చహల్.. నువ్వు ఆర్‌సీబీలోనే ఉండు. అదే నీకు సరైంది' అని చౌహాల్ ని కట్టడిని చేసాడు. దీనితో ఆ సంభాషణల నుంచి చహల్ విరమించుకున్నాడు. ఏది ఏమైనా IPL వాయిదాతో క్రికెట్ అభిమానులు బాగా డిస్సపాయింట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: