మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా ఈరోజు పూణే లో భారత్ , శ్రీలంక మధ్య చివరి మ్యాచ్ జరుగనుంది. ఈసిరీస్ లో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండోమ్యాచ్ లో ఇండియా సునాయాస విజయం సాధించింది. ఇక మూడో మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తుండగా ఈమ్యాచ్ లో నైనా గెలిచి సిరీస్ ను డ్రా చేసుకోవాలని శ్రీలంక పట్టుదలతో వుంది. అయితే అనుభవం లేని ఆటగాళ్ల తో కూడిన శ్రీలంక బ్యాటింగ్ , బౌలింగ్ లో బలహీనంగా ఉండడం తో టీమిండియా పై విజయం సాదించడం ఆ జట్టుకు అంత ఈజీ కాదు.
ఇక ఇదిలా ఉంటే కనీసం ఈ మ్యాచ్ లోనైన కేరళ వికెట్ కీపర్ సంజు శాంసన్ కు అవకాశం ఇవ్వాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ ,విండీస్ తో ల జరిగిన టీ 20 సిరీస్ ల నుండి సంజు బెంచ్ కే పరిమితం అవుతున్నాడు. దాంతో అతనికి ఒక్క మ్యాచ్ లోనైనా అవకాశం ఇచ్చి చూడాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పూణే టీ 20 లో కూడా ఇండోర్ లో గెలిచిన టీం తోనే బరిలోకి దిగాలని కోహ్లీ యోచిస్తున్నాడు. ఒకవేళ కోహ్లీ మనసు మార్చుకొని సంజు కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తే శివమ్ దూబే ను కానీ రిషబ్ పంత్ ను కానీ తప్పించాల్సి ఉంటుంది మరి కోహ్లీ అందుకు ఇష్టపడుతాడో లేదో చూడాలి.