మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో భాగంగా ఆదివారం గువహటి లో జరగాల్సిన మొదటి టీ 20 వర్షం వల్ల రద్దయింది. మ్యాచ్ రెండు రోజుల ముందు వరకు అక్కడ వర్షం కురిసినా మ్యాచ్ రోజు కూడా వరుణుడు కరుణించలేదు. టాస్ తరువాత వర్షం స్టార్ట్ కాగా ఎక్కువ సేపు కురువకపోయినా పిచ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు.
ఇక మ్యాచ్ ను చూడడానికి పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు స్టేడియానికి తరలివచ్చారు. అయితే వర్షం వారి ఆశల పై కూడా నీళ్లు చల్లింది. కనీసం చివరకు 5ఓవర్ల అటైనా సాధ్యపడుతుందనుకున్నారు కానీ సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేయలేకపోవడంతో మెయింటెన్స్ పై అసహనం వ్యక్తం చేస్తూ క్రికెట్ అభిమానులు స్టేడియం ను వీడారు. ఇక ఇరుజట్ల మధ్య రెండో టీ 20 ఈనెల 7న ఇండోర్ లో జరుగనుంది.