శ్రీలంక పై టీ20ల్లో కోహ్లీ యావరేజ్ ఎంతో తెలుసా ?

 

గత ఏడాది  క్రికెట్ లో తిరుగులేని అధిపత్యాని ప్రదర్శించిన టీమిండియా ఈఏడాది  కూడా  అదే జోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది. అందులో భాగంగా  ఈరోజు శ్రీలంక తో  గువహటి వేదికగా మొదటి టీ 20 లో తలపడనుంది. టీమిండియా ఈమ్యాచ్ లో గెలిచి విజయం తో ఈఏడాదిని ఆరంభించాలని చూస్తుంది. ఇక ఇప్పటివరకు  భారత్ , శ్రీలంక టీ 20ల్లో 16సార్లు తలపడగా 11సార్లు భారత్ , 5సార్లు  శ్రీలంక విజయం సాధించాయి. ఇందులో   సొంతగడ్డ పై  శ్రీలంక తో 8సార్లు తలపడగా  భారత్ 6సార్లు, 2సార్లు  శ్రీలంక విజయం సాధించాయి. 
ఇదిలాఉంటే  టీమిండియా సారథి కోహ్లీకి శ్రీలంక పై టీ 20ల్లో అద్భుతమైన రికార్డు వుంది.  ఆజట్టు పై  కోహ్లీ  250కి పైగా పరుగులు సాధించాడు. అతని యావరేజ్ 94.33.. తద్వారా  టీ 20ల్లో ఓ  టీం పై అత్యధిక యావరేజ్ కలిగిన  మూడో ఆటగాడి గా  కోహ్లీ రికార్డు సృష్టించాడు.  ఈజాబితాలో  మ్యాక్స్ వెల్ శ్రీలంక పై 140.50యావరేజ్ తో మొదటి స్థానం లో ఉండగా  మెక్ కల్లమ్ ,ఇండియా పై 130.50యావరేజ్ తో రెండో స్థానం లో వున్నాడు. మరి  ఈ రోజు జరగనున్న టీ 20లో  కూడా కోహ్లీ,  శ్రీలంక పై  తన  సూపర్ ఫామ్ ను కొనసాగిస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: