సానియాపై కామెంట్స్.. ఫ్రస్టేషనా.. ప్రతీకారమా..!!?

Balachander
మొన్న ఆదివారం రోజున ఇండియా.. పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా  జట్టు  పాకిస్తాన్ పై భారీ విజయం సాధించింది.  అది భారీ విజయం.  ఇండియా ప్రతి విభాగంలో అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శిస్తే... పాకిస్తాన్ మాత్రం ఫీల్డింగ్ నుంచి పేవలమైన ప్రదర్శనను ప్రదర్శించింది. 


ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్ లలో పాక్ కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.  సెమిస్ కు చేరుకోవాలి అంటే మిగతా అన్ని మ్యాచ్ లు గెలిచి తీరాల్సిందే. ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్ టీమ్ ను పాక్ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.  బర్గర్లు పిజ్జాలు తింటూ రాత్రి రెండు మూడు గంటల వరకు రెస్టారెంట్ లో గడిపితే గ్రౌండ్ లో నిద్ర రాక ఏమొస్తుందని విమర్శలు చేశాడు.  


పనిలో పనిగా ఓ అడుగు ముందుకు వేసి, పాక్ నటి వీణామాలిక్ .. క్రికెటర్ షోయబ్ మాలిక్ భార్య సానియా మీర్జాపై కామెంట్స్ చేయడం మొదలుపెట్టింది.  రాత్రిపూట హుక్కా బార్ కు వెళ్తే.. రెస్టారెంట్ లో జంక్ ఫుడ్ తింటే ఎలా.. వాళ్ళ ఆరోగ్యం ఏమౌతుంది.. అంటూ నానామాటలు అన్నది.  దీనిపై సానియా స్పందించింది.  


తన కొడుకును ఎలా చూసుకోవాలో తనకు తెలుసునని,  వేరే వ్యక్తులు చెప్తే విని  తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది. అక్కడితో ఆగకుండా సానియా  పాక్ క్రికెటర్లకు  తానేమి తల్లిని కాదని, టీజర్ను కాదని మండిపడింది.  ఏదైనా అసహనం ఉంటె దానిని వేరే విధంగా చూపించండిగాని, ఇలా తనపై ఆరోపణలు చేస్తే ఉపయోగం ఉండదని హెచ్చరించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: