మంచిమాట: పిసినారి తనం వల్ల నలుగురిలో మర్యాద పోవడం ఖాయం..!!

Divya
భీముని పురంలో రుద్రయ్య అనే ఒక పిసినారి ఉండేవాడు. అతను ఎవరికీ ఏ సహాయం కూడా చేసేవాడు కాదు. ఎప్పుడు చూసినా ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. అతని ఇంటి ముందు పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు ఉండటం వలన దాని నీడ తనదేనని భావించేవాడు. రుద్రయ్య.ఒక రోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన సాంబయ్య దారిన పోతూ ఎండగా ఉందని రుద్రయ్య ఇంటి ముందున్న చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు. ఇంతలో బయటకు వచ్చి రుద్రయ్య ఈ చెట్టు నాది దానికింద కూర్చోవడానికి వీలు లేదు అన్నాడు.
ఆ ఊరివారు రుద్రయ్య గురించి సాంబయ్య కు ముందే చెప్పారు. అయితే రుద్రయ్య ప్రవర్తన ను ప్రత్యక్షంగా చూసింది ఇప్పుడే రుద్రయ్య కు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు సాంబయ్య.. అతని తోనే నీ చెట్టు నేను కొనుక్కుంటాను అమ్ముతావా? అని అడిగాడు నీడలు అమ్మి కూడా డబ్బులు సంపాదించవచ్చనీ రుద్రయ్య చాలా ఆనందించాడు. డబ్బులు తీసుకుని నీడను ఎప్పుడైనా వాడుకోవచ్చుననీ అనుమతించాడు. సాంబయ్య రోజూ తన స్నేహితులతో చెట్టు కింద కూర్చోవటం మొదలుపెట్టాడు. తన ఆవులు మేకలు కూడా చెట్టుకు  కట్టడం మొదలు పెట్టాడు.

సాయంత్రం అయ్యేసరికి లేదా తెల్లవారు చెట్టునీడ రుద్రయ్య ఇంటి వాకిట్లో కిటికీ గుండా ఇంటి లోపల కూడా పడేది. సాంబయ్య తన ఆవును , మేకలను స్నేహితులను రుద్రయ్య ఇంటి వాకిట్లోకి కూడా తీసుకు రావటం మొదలు పెట్టాడు. నీడను అమ్ముకున్నాడు కాబట్టి రుద్రయ్య అతడిని ఏమీ అనలేక పోయాడు. ఒకరోజు రుద్రయ్య ఇంట్లో ఏదో వేడుక జరుగుతోంది. రుద్రయ్య స్నేహితులు, చుట్టాలు చాలామంది వేరే ఊరు నుంచి వచ్చారు. రుద్రయ్య మా ఇంట్లో వేడుక జరుగుతోంది. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు? వెళ్ళు అన్నాడు..అప్పుడు  సాంబయ్య ఈ నీడ నాది నువ్వే  నాకు అమ్మావు.. అది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే హక్కు నాకుంది అన్నాడు.. రుద్రయ్య స్నేహితులు చుట్టాలు అతను నీడ కూడా అమ్ముకున్నాడని వాళ్లలో వాళ్లు మాట్లాడుకోనీ నవ్వుకోవటం మొదలు పెట్టారు. సాంబయ్య కు అవమానంగా అనిపించింది. తన పిసినారితనం వల్ల తనకే సిగ్గేసింది. బుద్ధి తెచ్చుకొని అప్పట్నుంచి తన ప్రవర్తనను మార్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: