మంచిమాట: దానధర్మాలు చేయాలి తప్ప చేస్తామని హామీ ఇవ్వకూడదు..!

Divya
గౌరీపురం అనే ఊరిలో హేమంతుడు అనే ధనవంతుడు ఒకరు ఉండేవాడు. అతనికి పెద్ద భవనం తో పాటు డబ్బు ,ధనం, కేజీల కొద్దీ బంగారం, వస్తువులు , వాహనాలు ఇలా ఎన్నో లెక్కలేనన్ని నిధులు ఉండేవి. అయితే దానధర్మాల విషయంలో మాత్రం అతను పరమ పిసినారి మాత్రమే కాదు నీ చుడు కూడా .. ఎవరైనా ఏదైనా అడగడానికి వస్తే ఏవో ఒకరకంగా సాకులు చెప్పి ఆ తర్వాత రమ్మనీ తెప్పేవాడు..పాపం వాళ్ళు ఆశతో మళ్లీ ఆశతో వెళ్తే తర్వాత రమ్మని, మళ్ళీ వెళ్తే మళ్లీ ఏదో కారణం చెప్పేవాడు. అంతేగాని ఒక్క అణ పైసా కూడా ఇచ్చేవాడు కాదు. ఈ విధంగా హేమంతుడికి ఊర్లో చెడ్డ పేరు బాగా వచ్చింది.
అదే ఊరిలో ప్రసన్నుడు అనే ఇంకో వ్యక్తి ఉండేవాడు. అతడు హేమంతుడులా ధనవంతుడు కాకపోయినా తనకి  ఉన్నంతలో ఇతరులకు  తగినంత సాయం చేస్తూ ఉండేవాడు. ఇక అడిగిన వారికి లేదనకుండా తృణమో పణమో దానంగా, అప్పగా  ఇస్తుండడంతో ప్రసన్నుడిని అందరూ మెచ్చుకునే వారు. ఇది చూసి హేమంతుడికి బాగా ఈర్ష్య కలిగింది. హేమంతుడు ఒక ఉపాయం ఆలోచించాడు. కొంతకాలం మీరు ఆగండి నేను నాకున్న  ఆస్తి మొత్తాన్ని ఈ ఊర్లో బడి, గుడి కట్టించడానికి దానధర్మాలు ఇచ్చేస్తాను. అని అందరినీ పిలిచి చెప్పటం ప్రారంభించాడు.
 అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు..
ప్రసన్నుడు ఎప్పటిలాగే అందరికీ సాయం చేస్తూ.. బడికి వెళ్లే పేద పిల్లలకు పలకలు, బలపాలు, బ్యాగ్ లు  ఉచితంగా ఇవ్వడం మొదలపెట్టారు. అలాగే గుడికి వెళ్లే భక్తులకు ఉచితంగా ప్రసాదాలు  కూడా పంచి పెట్ట సాగాడు. ఒకరోజు ప్రసన్నుడు కి ఊర్లో ఘన సన్మానం జరిగడం చూసి..నా ఆస్తిని బడికి గుడికి ఇస్తానంటే నాకు కాకుండా సన్మానం ఇతనికి చేస్తారా..?  అని హేమంతుడు అందరినీ గట్టిగా అడిగాడు.. మీరు ఎప్పుడో ఇస్తాను అన్నారు. ఆయన ఇప్పుడే  మాకు ఇస్తున్నారు అదీ తేడా అన్నారు ప్రజలు.. దాంతో తన తప్పు తెలుసుకొని అప్పటినుంచి ఉదారంగా ఉండ సాగాడు హేమంతుడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: