మంచిమాట : మనం ఏ గింజ వేస్తే ఆ మొక్కే మొలుస్తుంది..!!
ఈసారి ఆ కొంగ చేపలను పట్టుకోవడం మానేసి చాలా బాధగా అలా నిల్చోని ఉంది. ఆ కొలనుకి దగ్గర్లో నివసిస్తున్న ఒక ఎండ్రకాయ అయ్యా..! మీరు ఈరోజు చాలా విచారంగా కనిపిస్తున్నారు ఏం జరిగింది. అని అడిగింది.. దానికి ఆ కొంగ గ్రామస్తులు అందరూ ఈ కొలను పూడ్చడానికి ఆలోచిస్తున్నారని నేను విన్నాను. ఈ కొలనులోని చేపలన్ని చనిపోతాయని నేను ఆలోచిస్తున్నాను. నేను కూడా ఆహారం కోసం వేరే చోటు చూసుకోవాలి. అని సమాధానమిచ్చింది కొంగ..అప్పుడు ఎండ్రకాయ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి స్నేహితులైన చేపలన్నింటికీ ఈ విషయం చెప్పింది.
ఈ వార్తవిన్నచేపలన్నీ భయపడి తమకు సహాయం చేయమని కొంగను బతిమాలాయి. కొంగ తన పథకం ఫలించిందని చాలా సంబరపడింది..కొంగ చేపలతో సరే మీకు సహాయం చేయడానికి ఒకే ఒక్క దారి ఉంది. అదేంటంటే రోజు నేను కొన్ని చేపలను పక్కనే ఉన్న మరో కొలనుకి తీసుకొని వెళ్తాను. సరేనా అని చెప్పింది. ఆ విషయం విన్న తరువాత చేపలు చాలా ఆనందించాయి. అలా ప్రతిరోజూ ఆ కొంగ కొలను దగ్గరకు వచ్చి, కొన్ని చేపలను పట్టుకొని ఎగిరి వెళ్ళిపోయేది. ఈసారి ఎండ్రకాయ వంతు వచ్చింది. ఎప్పటిలాగే కొంగ ఎండ్రకాయను తన ముక్కుతో కరచుకొని ఎగిరి పోతూ ఉంది.
కొంత దూరం వెళ్ళాక.. ఎండ్రకాయ కొంగతో అంది అయ్యా.. ఆ కొత్త కోనేరు ఎంత దూరంలో ఉంది. అని అడిగింది అప్పుడు దానికి కొంగ నవ్వుతూ మీకు సాయం చేయటానికి నేనేమైనా మూర్ఖుడినా అంటూ పక్కనే ఎముకలతో కప్పబడి ఉన్న ఒక రాళ్లగుట్ట ని చూపించి, ఇదే నీ స్నేహితులంతా మరణించిన ప్రదేశం.. ఇప్పుడు నీ వంతు వచ్చింది. దాంతో ఎండ్రకాయకి చాలా కోపం వచ్చింది. ఎండ్రకాయ ఎలాగైనా సరే కొంగకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఎండ్రకాయ తన పదునైనచేతులతో కొంగ మెడపై గుచ్చింది. ఆ బాధతో కొంగ ఎగరలేక ఎగరలేక కింద పడి మరణించింది. అప్పుడు ఎండ్రకాయ కొలను వద్దకు చేరి మిగిలిన చేపలతో కొంగ తమను మోసగించిన విధానాన్ని క్రూరమైన కొంగను తన చేతులతో ఎలా చంపిందో ఆ వైనాన్ని వివరించింది.