భారతీయ జనతా పార్టీకి రాయలసీమ మీద చాలా అంటే చాల ఆశలే ఉన్నాయి. అయితే అన్ని ఆశలు ఉన్నా.. ప్రజలకు చేసేది మాత్రం ఏమీ లేదు అసలు ప్రజలను పట్టిచుకోవడం లేదు. కనీసం రాయలసీమ వరకూ అయినా ప్రత్యేక హోదా ఐనా ప్రకటించి ఉన్నాకనీసం కొంత గౌరవంగా ఉండేది. అయితే బీజేపీ వాళ్లు ఏపీకి మొండి చేయి చూపిస్తూ ఉన్నారు అని తెలుస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోవడానికి కూడా వాళ్లకు మనసు రావడం లేందంటే చూడాలి మరి. ఏపీకంతటికీ ప్రత్యేకహోదా ఇవ్వడం మాట పక్కకి పెట్టి..కనీసం రాయలసీమ వరకూ - గ్రేటర్ రాయలసీమ వరకూ ప్రత్యేకహోదా ఇచ్చినా బీజేపీకి అంతో ఇంతో పరువు నిలుస్తుంది.
అన్ని మనము అనుకోవలిసిందే తప్ప అలాంటివి ఏమీ ఉండవు అని ప్రజలకు బాగా అర్థం అయంది. హామీలు ఏవి నెరవేర్చరు కానీ జనాలు మాత్రం ఎగేసుకుని వెళ్లి బీజేపీకి ఓటేయాలి. అదీ బీజేపీ మార్కు రాజకీయం. ఆ పార్టీ సంగతలా ఉంటే..ఆ పార్టీకి చేరిన నేతల హడావిడి కూడా అంత ఇంత కాదు చాల ఎక్కువగా ఉంది.
అలాంటి వారిలో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది టీజీ వెంకటేష్. ఇటీవలే బీజేపీ నేత అయిన టీజీ ఎంపీ హోదాలో రాజధాని గురించి తెగ మాట్లాడుతూ ఉన్నారు. కర్నూలే రాజధాని అని, కర్నూలును రాజధానిగా చేయాలని, కర్నూలు రాజధానికి అనువైన ప్రాంతం.. అంటూ మాట్లాడుతూ వచ్చారు. మరి ఇంత కర్నూలు వీరాభిమాని ఐనా టీజీ.. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు మరి? అప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి స్మరణ చేస్తూ .. కర్నూలుకు కనీసం కొంత విలువ అయినా ఇవ్వనప్పుడు ఏం చేశారు మరి టీజీ?అంటే.. ఆ ప్రశ్నలకు అసలు సమాధానాలు లేవు!
అప్పుడు చంద్రబాబు వద్ద ఉన్నాడు కాబట్టి.. ఏమి అనలేదు. ఇప్పుడు రాయలసీమలో ఏదో రాజకీయం చేసేయాలని బీజేపీ తెగ దొందరపడుతుంది కాబట్టి.. ఇలాంటి మాటలు. మరి టీజీ మాటల్లో ఉన్న పస ఎంత? అంటే.. అది బీజేపీ పార్టీ వాళ్లకే మాత్రం తెలియాలి. టీజీ ఇలాంటి వాదనలను మీడియా ముందుకు తేవడం కన్నా .. ఢిల్లీకి వెళ్లి తమ పార్టీ అధిష్టానం ముందు వినిపిస్తే అసలు సంగతి ఏమిటో తేలుతుందేమో. అలాంటి పని ఈ ఎంపీ ఎందుకు ముందు అడుగు వేయడం లేదు మరి ఎందుకో??