పార్టీని నాశనం చేస్తున్నారు.. టీడీపీలో మంత్రి కామెంట్స్ కలకలం ...?

Chakravarthi Kalyan

ఆయన ఓ మంత్రిగారు.. పశ్చిమగోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఆయన వైసీపీలోకి జంప్ అవుతాడని స్థానిక నేతలు చెబుతున్నారు. ఈ మేరకు చంద్రబాబుకు కూడా కంప్లయింట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ మంత్రిగారు తాజాగా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.



ఇంతకీ ఆ మంత్రి ఎవరో చెప్పలేదు కదూ.. ఆయనే జవహర్.. ఇటీవల ఆయనకు అసమ్మతి బెడద చాలా ఎక్కువైంది. ఆయన మళ్లీ కొవ్వూరులో పోటీ చేయరని.. ఆయనకు టికెట్ రాదని కొందరు ప్రచారం చేస్తున్నారు. దీనిపై మంత్రి మండిపడ్డారు. మంత్రి పూర్వీకులు కృష్ణా జిల్లా తిరువూరుకు చెందినవారు కాబట్టి ఈసారి మంత్రి అక్కడ నుంచి పోటీ చేస్తాడని కూడా పుకార్లు పుట్టిస్తున్నారు.



దీంతో మంత్రి జవహర్ స్పందించారు. తాను రాబోయే ఎన్నికల్లో కొవ్వూరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. టీడీపీలో కొందరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడు తున్నారని మంత్రి ఆరోపించారు. వీరి సంగతి అధిష్ఠానమే చూసుకుంటుందని స్పష్టం చేశారు.



సీఎం చంద్రబాబు ఇంకా కొవ్వూరు సీటుపై క్లారిటీ ఇవ్వకపోవడం కూడా ఈ విమర్శకు ఆస్కారం ఇస్తోంది. ఇంతకూ మంత్రిగారికి వ్యతిరేకంగా పని చేస్తున్నదెవరు..మంత్రి గారు నిజంగా కొవ్వూరు నుంచే పోటీ చేస్తారా.. తన అసమ్మతి నేతలకు ఎలా చెక్ పెడతారన్నది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: