మోడీ తిట్టేందుకు బాబు ఖర్చు చేసిన ప్రజాధనం 500 కోట్లా..?

Chakravarthi Kalyan

ఏపీ సీఎం చంద్రబాబు కొన్నాళ్లుగా కేంద్రంపై తిరుగుబాటు చేస్తున్నారు. ధర్మపోరాట దీక్షల పేరుతో రాష్ట్రమంతటా దీక్షలు చేస్తున్నారు. రాష్ట్రంలో దీక్షలు పూర్తయ్యాక ఢిల్లీలోనూ దీక్ష చేపట్టారు. అయితే ఈ దీక్షలన్నీ సర్కారు సొమ్ముతో చేయడం విశేషం.



ఇలా చంద్రబాబు చేస్తున్న దీక్షల ఖర్చు 500 కోట్లకు చేరిందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మోదీని తిట్టడానికి చంద్రబాబు ఇప్పటికే రూ.500 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆ పార్టీ నేత సోము వీర్రాజు అంటున్నారు. రాజధాని నిర్మాణం కోసం మోదీ నర్మదా నది నుంచి నీళ్లు, మట్టి తెస్తే చంద్రబాబు ఆనందంగా స్వీకరించలేదా అని ఆయన ప్రశ్నించారు.



పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద భోజనాల కాంట్రాక్టర్‌ ఇరిగేషన్‌ మంత్రి బంధువుదేనని సోము వీర్రాజు ఆరోపిస్తున్నారు. బీజేపీ మండలానికో సబ్‌ స్టేషన్‌ కట్టిస్తే.. టీడీపీ ఉద్యోగాలు అమ్ముకుంటోందని ఆరోపించారు. మార్చి ఒకటిన విశాఖలో బీజేపీ కార్యకర్తలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమవుతారని ఆయన తెలిపారు.



ఈ నెల 19న ఒంగోలులో, 21న రాజమండ్రిలో అమిత్ షా సమావేశాలు నిర్వహిస్తారని సోము వీర్రాజు తెలిపారు. ప్రధానికి స్వాగతం చెప్పని బాబు సంతలో చింతకాయలు అమ్ముకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏపీకీ మోదీ ప్రభుత్వం ఐదున్నర లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని సోము వీర్రాజు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: