సోషల్ మీడియాలో టీడీపీ నేతల పై విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి..!

KSK
ఎన్నికలు దగ్గరకొస్తున్న క్రమంలో ఏపీ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ఇప్పటికే పాద యాత్రలో ఉన్న జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేస్తుండగా మరో పక్క ఏపీ మంత్రులు జగన్ ని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేస్తూ కౌంటర్ లు వేస్తున్నారు.


ఇదిలా ఉండగా తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పై మరియు ఆయన కుమారుడు నారా లోకేష్ పై సంచలన పోస్ట్ పెట్టారు ఫేస్ బుక్ లో. "లోకేష్ నాయుడు తెచ్చిన పరిశ్రమలెన్నో, ఐటి కంపెనీలెన్నో లెక్క తేలుస్తాం. 6 నెలలు ఓపిక పట్టు చిట్టి. కమిషన్లకు కక్కుర్తి పడి బోగస్ కంపెనీలకు వందల కోట్ల విలువైన భూములు, రాయితీలిచ్చింది ప్రజలకు తెలుసు. యెల్లో కుల మీడియా దాచిపెట్టినంత మాత్రాన ప్రజల కళ్లకు గంతలు కట్టలేరు" అని అన్నారు.


అంతేకాకుండా ఇటీవల వైసీపీ అధినేత జగన్ పై సవాలు చేసిన లోకేష్ కి కౌంటర్లు వేశారు విజయసాయిరెడ్డి.."దొడ్డిదారి మంత్రి లోకేష్ సవాళ్లు వింటే నవ్వొస్తుంది. ప్రతిపక్ష నాయకుడు ఎండనక, వాననక ఏడాది పైగా ప్రజల మధ్య పాదయాత్ర చేస్తుంటే కనిపించట్లేదా చిట్టి? కరెంటు, మంచినీరు లేక చలిలో ప్రజలు హాహాకారాలు చేస్తుంటే 4 రోజులు అమరావతి, 3 రోజులు హైదరాబాద్ దాటి బయటకు రాని నువ్వు వైఎస్సార్ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నవా? బందిపోట్లలా దోచుకున్న ప్రజల సొమ్మును తెలంగాణా ఎన్నికల్లో వెదజలల్లింది ఎవరో? అక్కడి ప్రజలు ఫుట్ బాల్ ఆడుకుంటే జైపూర్, బోపాల్ చుట్టు తిరిగిరావడం ప్రజా సేవా?" అని ప్రశ్నించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: