రోజా షాకింగ్ కామెంట్స్..చిత్తూరులో లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి జాగ్రత్త..!

KSK
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే వైసిపి నాయకురాలు ఫైర్ బ్రాండ్ రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాజాగా ఇటీవల తన సొంత నియోజకవర్గం నగర్ లో రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమంలో పాల్గొన్న రోజా..తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి ఎటువంటి నిధులను విడుదల చేయలేదని కావాలనే తనపై కక్ష సాధింపు చర్యలు సీఎం చంద్రబాబు చేశారని నగరి నియోజకవర్గ ప్రజల ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు.  


ప్రభుత్వం సహకరించకపోయినా వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పై ప్రత్యేకమైన దృష్టి ఉన్న నేపథ్యంలో.. మీరు నా పట్ల 2014 ఎన్నికల్లో చూపించిన ప్రేమకు సొంత నిధులతో నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతు ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు ఎమ్మెల్యే రోజా.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారు అని అప్పుడు నియోజకవర్గంలో ఉన్న సమస్యలని పూర్తిగా పరిష్కారమవుతాయని భరోసా ఇచ్చారు. మరోవైపు దివంగత టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబం ప్రోటోకాల్‌ను పక్కదారి పట్టిస్తోందని రోజా ఆరోపించారు.


ప్రజా ప్రతినిధిగా ముద్దుకృష్ణమ నాయుడి సతీమణి సరస్వతి ఉండగా ప్రభుత్వం కార్యక్రమాల్లో మాత్రం ఆమె కొడుకు పాల్గొంటున్నాడని రోజా విమర్శించారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తుందని ఇందుమూలంగా కలెక్టర్ కు ముందే ఫిర్యాదు చేసినట్లు రోజా తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: