రాష్ట్రంలో మీడియా సరిగ్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తే బాబు ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయేది…!

KSK
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన కరమైన కామెంట్ చేశారు. చంద్రబాబు ఒక మానసిక రోగి అని ఆ రోగం వల్ల రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని కన్నా పేర్కొన్నారు. గతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసిందని లబోదిబోమంటున్న చంద్రబాబు సడన్ గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే న్యాయం చేసింద అనటం ఏమిటని…ఇది మతి భ్రమించి మాట్లాడటం కాదా అన్నారు.

కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబులో ఒక అపరిచితుడు ఉన్నారని పేర్కొన్నారు. పోలవరం ఏడు ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపింది బీజేపీ అని గుర్తు చేస్తూ ప్రదాని మోదీ ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపి ఉండక పోతే పోలవరం కలగానే ఉండిపోయేదన్నారు. చంద్రబాబు తన ఖజానా నింపుకోవడానికి పోలవరం నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పెంచేసిందని అన్నారు.

అంతేకాకుండా పోలవర౦ నిర్మాణానికి పెండింగ్ బిల్లు బకాయిలు లేవని కూడా కన్నాతెలిపారు. సమాచార హక్కు చట్టం (ఆర్ టీ ఐ) ద్వారా వివరాలు అడిగిన తమకి పోలవరం ప్రాజెక్టుకు బకాయిల౦టూ ఏమీ లేవని అధికారులు చెప్పినట్టు కన్నా గుర్తు చేశారు. రూ.1950 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని చంద్రబాబు అబద్దాలు ఆడుతున్నారని కన్నా పేర్కొన్నారు.

 ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి కేంద్రానికి అబద్ధాలు చెప్పి డబ్బులు దండుకుని తీరా దొరికిపోయాక ఆ తప్పును తన అనుకూల మీడియా ద్వారా కేంద్రంపై నెట్టివేయడం వాళ్ళనే ఇప్పటిదాకా చంద్రబాబు రాజకీయాలలో రాణించారని పేర్కొన్నారు. నిజంగా ఆంధ్రరాష్ట్రంలో మీడియా సరిగ్గా తన బాధ్యతలు నిర్వర్తిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయేది అని అంటున్నారు కన్నా లక్ష్మీనారాయణ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: