ప్రశ్నిస్తే..దాడి చేస్తారా..ఖబడ్దార్ పవన్ కల్యాణ్..!

Edari Rama Krishna
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కత్తి మహేష్ వర్సెస్ పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ కి మద్య మాటల యుద్దం జరుగుతూనే ఉంది.  పవన్ కళ్యాన్ పై  విమర్శలు గుప్పిస్తూ వస్తున్న కత్తి మహేష్ వారం రోజులు సైలెన్స్ గా ఉన్నా మరోసారి ఆయన గొంతు విప్పారు. తాను మౌనంగా ఉండటంతో పవన్ క్షమాపణలు చెప్పాలని..కాళ్లు పట్టుకోవాలని కొంత మంది తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లుగా చెప్పారు..అంతే కాదు తన కుటుంబంపై కూడా విమర్శలు చేస్తున్నారని కత్తి మహేష్ ఓ ఛానల్ లె చెప్పారు. 

ఇదిలా ఉంటే..ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొని వెళుతున్న ఫిల్మ్ క్రిటిక్ మహేశ్ కత్తిపై గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో ఈరోజు రాత్రి దాడి చేశారు. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కారు దిగిన వెంటనే ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు కొందరు ఈ దాడికి పాల్పడ్డట్టు సమాచారం.  ఈ దాడిలో కత్తి మహేష్ కంటిపై గాయం అయ్యింది..ఈ సందర్భంగా కత్తి మహేష్ మాట్లాడుతూ.. తనను అసభ్య కామెంట్లతో వేధింపుల పాలు చేస్తూ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పవన్ ఫ్యాన్స్ ప్రవర్తిస్తున్నారని, చివరికి హద్దులు దాటి తనపై దాడి కూడా చేశారని ఆరోపిస్తున్నారు. 

తాను గుర్తించిన పది మంది వ్యక్తులపై ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. వాళ్లకు వాళ్లు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ పలు ఛానెల్స్ ద్వారా తనకు చేసిన ఫోన్ కాల్స్, పోస్ట్ చేసిన వీడియోల ఆధారంగా ఈ ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మరోవైపు కత్తిపై దాడిని  ఓయూ జేఏసీ ఖండించింది. నేడు తెలంగాణ వ్యాప్తంగా పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలు తగలబెట్టాలని పిలుపు నిచ్చింది.

ఈ సందర్భంగా ఓయూ జేఏసీకి చెందిన రవి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో దాడులు చేయడమనేది అనాగరికమని మండిపడ్డారు. ఈ దాడిని తాము ఖండిస్తున్నామని అన్నారు. పవన్ కల్యాణ్ తన అభిమానులకు మాట మాత్రం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘ఖబడ్దార్ పవన్ కల్యాణ్.. తెలంగాణలో నిన్ను తిరగనివ్వం. అభిమానులకు చెప్పుకోలేని మూగవాడివి. నీ అభిమానులతో కత్తి మహేశ్ పై దాడి చేయిస్తావా?’ అంటూ తీవ్రంగా మండిపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: