తాగి నడిపేవారు మానవబాంబులే : ఢిల్లీ హైకోర్టు

Edari Rama Krishna
భారత దేశంలో చాలా వరకు రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి నడపడం వల్లే అని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయ పడింది. ఒకరకంగా చెప్పాలంటే మద్యం తాగి వాహనాలు నడిపే వారే మానవ బాంబులు అని ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.  వీరు ప్రజానీకానికి చాలా అపాయకరమని ఆందోళన వ్యక్తం చేసింది. వీరి నిర్లక్ష్యం వల్ల రోడ్డు ప్రమాదం జరిగితే ఒక్కరి ప్రాణాలు పోయినా ఆ కుటుంబం ఎంతో విల విలలాడుతుంది.

ఇప్పటికే రోడ్డు ప్రమాదాలు నియంత్రించడానికి ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకున్నా ఇలాంటి వాటిని అరికట్టలేక పోతున్నారు.  తాగి కారును నడిపిన వ్యక్తికి ఆరు రోజులపాటు జైలుకు పంపిస్తూ తీర్పు చెప్పిన సందర్భంగా కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది. బాదర్పూర్ అనే ప్రాంతానికి చెందిన జోగి వర్గిస్ అనే వ్యక్తి తాగి కారు నడిపిన కారణంగా కింది స్థాయి కోర్టు ఆరు రోజుల జైలు శిక్షను, రూ.2000 ఫైన్ వేసింది.


అయితే, దీనిని సవాల్ చేస్తూ వర్గిస్ ఢిల్లీ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశాడు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సెషన్స్ కోర్టు జడ్జి లోకేశ్ కుమార్ శర్మ కిందిస్థాయి కోర్టును సమర్థించారు. తాగి డ్రైవింగ్ చేసేవారు సమాజానికి ప్రమాదకరమని, వారు కళ్లమందు కనిపించే మానవబాంబుల్లాంటివారని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: