రథసప్తమి: దరిద్రం వదిలి పోవాలంటే..ఈరోజు ఏ రాశి వారు ఏం దానం చేయాలంటే..?

Divya
సనాతన ధర్మంలో సూర్యరాదనకు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ముఖ్యంగా మాఘమాసంలో రథసప్తమి రోజున సూర్య జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున (జనవరి 25) సూర్యుడు తన దిశను మార్చుకొని ఉత్తరాయణం వైపుగా పయనిస్తారు. అందుకే ఈ పర్వదినాన దానధర్మాలు చేస్తే రెట్టింపు పుణ్యం లభిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. ఈ రోజున పడే సూర్య కిరణాలు ప్రత్యేక శక్తిని ప్రసాదింపచేసేలా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలో ఉండే దోషాలు తొలగిపోయి, అదృష్టం వరిస్తుందో తెలియజేస్తున్నారు వాటి గురించి చూద్దాం.


మేషరాశి వారు:
బెల్లం, శనగలు, ఎర్రటి వస్త్రం దానం చేయడం వల్ల అనుకున్న పనిలో విజయం సాధిస్తారు.


వృషభరాశి:
పాలు, తెల్లటి నువ్వులు, బియ్యం వంటి విధానం చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు.

మిథున రాశి:
పెసరపప్పు, ఆకుపచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.

కర్కట రాశి:
తెల్లని వస్త్రాలు, చక్కెర దానం చేస్తే ప్రశాంతత లభిస్తుంది.

సింహరాశి:
బెల్లం, గోధుమలు దానం చేయడం వల్ల గౌరవం సమాజంలో పెరుగుతుంది.

కన్య రాశి:
ఏవైనా పప్పు ధాన్యాలు దానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.


తులా రాశి:
బియ్యం దానం చేయడం వల్ల విలాసవంతమైన సౌకర్యాలు లభిస్తాయి.

వృశ్చిక రాశి:
శత్రుజయం లభించాలి అంటే ఎరుపు రంగు వస్తువులను దానం చేయాలి.

ధనస్సు రాశి:
పసుపు రంగు వస్త్రాలను లేదా నవధాన్యాలలో ఏదో ఒకటి దానం చేయడం వల్ల అదృష్టం లభిస్తుంది.


మకర రాశి:
నల్లటి నువ్వులు దానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది.


కుంభరాశి:
నాణేలు దానం చేయడం లేదా తెల్లటి నువ్వులు దానం చేయడం వల్ల  అదృష్టం కలుగుతుంది.

మీన రాశి:
పండ్లు దానం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఉన్నతి పొందుతారు.


ఈ రథసప్తమి రోజున ఉదయం లేచి స్నానం చేసి ఆ సూర్యభగవానుని పూజిస్తూ దానధర్మాలు చేయడం వల్ల మీ ఇంటిల్లిపాది సుఖసంతోషాలతో ఉంటారని పండితులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: