కొండగట్టు ఆలయానికి పవన్ కళ్యాణ్ రూ. 30 కోట్లు..?

Divya
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకవైపు గ్రామీణ అభివృద్ధి మరొకవైపు అడవుల సంరక్షణ వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఆంధ్రాలో పలు ప్రాంతాలలో పర్యటిస్తూ జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు భక్తి భావనలు అంటే ఎక్కువని చాలా సందర్భాలలో చూస్తూ ఉన్నాం. వారాహి యాత్రకు ముందు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఒక ఆలయానికి తరచూ వెళ్తూ ఉండేవారు. ఆ ఆలయమే ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం.



జగిత్యాల జిల్లాలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయానికి వెళ్లి స్వామివారిని చాలాసార్లు దర్శించేవారు పవన్ కళ్యాణ్. అలాగే మొక్కులు కూడా చెల్లించేవారు. అయితే ఇప్పుడు ఆ దేవాలయానికి ఏకంగా రూ .30 కోట్ల రూపాయలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ నిధులను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మంజూరు చేయించినట్లుగా వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారికంగా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కు కొండగట్టు ఆలయం అనేది చాలా ప్రత్యేకమైన సెంటిమెంట్ అని చెప్పవచ్చు.



తన రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు ఈ ఆలయాన్ని సందర్శించారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో కూడా అక్కడ ఆలయానికి వచ్చి మరి పూజలు చేసిన సందర్భాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. జనసేన పార్టీ ప్రారంభంలో కూడా పూజలు చేయించి ఆంజనేయ స్వామి ఆశీస్సులను తీసుకొని మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా వారాహి వాహనానికి ఆలయంలో పూజలు చేయించి మొదలుపెట్టారు. ఇక ఏపీలో కూటమిలో భాగంగా గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని ఆలయ అభివృద్ధి పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టారు డిప్యూటీ సీఎం. ముఖ్యంగా అక్కడ భక్తులకు వసతి సౌకర్యం, గదులు, దీక్ష మండపం వంటివి నిర్మించడానికి  తాజాగా రూ.30 కోట్ల రూపాయలు ttd నిధులనుంచి  వినియోగించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: