భారత్.. చెప్పుల ధర అక్షరాల రూ. 84 వేలు.. ఎక్కడంటే..?

Divya
మనదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి కొల్హాపురి చెప్పుల బ్రాండ్ ని కాపీ కొట్టి ఏకంగా ఇటలీకి చెందిన ప్రాడా సంస్థ అదే తరహాలో చెప్పులను తయారు చేసి ఏకంగా అక్కడ రూ.70 నుంచి రూ .90 వేల రూపాయల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ బ్రాండ్ తమదేనని తమ డిజైన్ ను కాపీ కొట్టే ఇలా అమ్మకాలు కొనసాగిస్తున్నారని వీటిపైన కనీసం క్రెడిట్ కూడా భారత్ కు ఇవ్వలేదని చాలామంది ప్రాడా సంస్ధ పై అభ్యంతరాలను తెలియజేస్తున్నారు.


ఇలాంటి అభ్యంతరాలు నడుమ ప్రాడా కంపెనీ తాము తయారు చేస్తున్న డిజైన్ భారత మూలాలకు చెందినవే అని అంగీకరించింది. అంతేకాకుండా మీరు కూడా ఈ బ్రాండ్ పేరుతోనే ఇండియాలో అమ్మకాలు జరుపుకోవచ్చు అంటూ మహారాష్ట్ర ప్రభుత్వంతో గత గురువారం (డిసెంబర్ 11)  రోజున ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ లిమిటెడ్ ఎడిషన్ చెప్పులను ఫిబ్రవరి 2026 నుంచి అటు ఆన్లైన్లో దొరుకుతాయని, ప్రపంచవ్యాప్తంగా 40 ప్రాడా దుకాణాలలో కూడా అందుబాటులో ఉంటుందట. వీటి ధర 939 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించినట్లు వినిపిస్తోంది. (అంటే ఇండియన్ కరెన్సీ లో రూ. 84,000 రూపాయలు)


అలాగే తామెప్పుడు కళాత్మక నైపుణ్యం ,వారసత్వం, డిజైన్ వంటి సంప్రదాయాలను గౌరవిస్తూనే వచ్చాము ఈ విషయం పైన మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నామని అందుకు సంబంధించి బిబిసికి ప్రతిపాదన కూడా చేశామని తెలిపారు." ప్రాడా మేడ్ ఇన్ ఇండియా ఇన్స్పైర్ బై కొల్హాపురి చెప్పల్స్ " అనే పేరుతో ఉండబోతున్నట్లు తెలియజేశారు. ప్రాడా అవసరాలు డిమాండ్లను సైతం దృష్టిలో పెట్టుకొని మరి వారిని ప్రోత్సహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ ద్వారా ప్రత్యేకించి మరి శిక్షణ అందించేలా చేస్తామని  తెలిపారు. అలా మహారాష్ట్ర - ఇటలీ మధ్య ఐదేళ్లపాటు ఒప్పందం కుదుర్చుకుంటామని మహారాష్ట్ర మంత్రి సంజయ్ సిర్సాత్  తెలియజేశారు. ఈ చెప్పులను తోలుతో తయారుచేస్తారని దీని మూలాలు 12వ శతాబ్దం నుంచి ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ చెప్పులు భారత్ లోని వేడి వాతావరణానికి సరిగ్గా ఉపయోగపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: