చంద్రబాబు రాజకీయాలు... భువనమ్మ త్యాగం.. లోకేష్ చెప్పిన మాట ఇదే..!
మా అమ్మగారి త్యాగం వల్లే చంద్రబాబు గారు రాజకీయాలు చేస్తున్నారు
నాకు, బ్రాహ్మణికి చిన్న వయసులోనే పెళ్లి చేశారు. మేం సమానంగా ఇంటిపనులు చేసేవాళ్లం. నేను పాదయాత్ర చేసి అహర్నిశలు ప్రజల కోసం కష్టపడుతున్నానంటే అందుకు బ్రాహ్మణి సహకారమే కారణం. బ్రాహ్మణి సహకారం లేకపోతే నేను ఏం చేయలేను. మా అమ్మగారి త్యాగం వల్లే చంద్రబాబుగారు రాజకీయం చేస్తున్నారు. మా అమ్మగారు త్యాగం చేయకపోతే బాబుగారు రాష్ట్రానికి సేవ చేయలేరు. మహిళల త్యాగాలతోనే మేం ఈ స్థాయిలో ఉన్నాం. రెడ్ బుక్ పేరు వింటేనే గుండెపోటు వస్తోంది. మహిళలకు గౌరవం పెరిగేలా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.
మచిలీపట్నం పర్యటనలో మంత్రి లోకేష్ కు అడుగడుగునా స్వాగతం
పార్టీ కార్యక్రమాలు, కృష్ణా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రోడ్డుమార్గం ద్వారా మచిలీపట్నం బయలుదేరిన విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఘనస్వాగతం పలికారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మొవ్వ మండలం నిడుమోలు వద్ద మంత్రి లోకేష్ కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజానీకం ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు.