
ఏపీ: మెడికల్ షాప్ లపై విజిలెన్స్ అధికారులు తనిఖీ.. గుట్టు వీడుతుందా..?
నెల్లూరు ప్రాంతంలో అధికారులు దాడులు నిర్వహించగా.. మత్తు పదార్థాలను అక్రమంగా అమ్మితే కచ్చితంగా చర్యలు తప్పవంటూ అధికారులు ఆదేశాలను జారీ చేశారట. దీంతో అక్కడ తనిఖీ చేసిన మందు షాపుల దుకాణాల అధికారులు కంగుతున్నారూ. అనంతపురంలో కూడా అధికారులు సంయుక్తంగా సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం ,టవర్ క్లాక్ వద్ద ఉండే మెడికల్ షాప్ లపై కూడా తనిఖీలు చేశారట.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికారులు దాడులు నిర్వహించగా.. రాజమండ్రిలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తిరుమల ఏజెన్సీల ట్రమడాలు , మత్తు మందుకు సంబంధించి 255 ఇంజక్షన్లను కూడా పట్టుకున్నారట. ముఖ్యంగా యువతను మత్తు కలిగించే మెడిసిన్ ని కూడా విడివిడిగా వాడుతున్నట్లు అధికారులు తెలియజేశారు. అందుకే 16 ప్రాంతాలలో కూడా దాడులు ఒకేసారి నిర్వహించామని తెలియజేశారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైనా మెడికల్ ఏజెన్సీలో మెడికల్ షాపులలో ఇలాంటి వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటూ తెలియజేశారు. ఏపీ అంతట 100 మంది టీమ్స్ తో దాడులు జరపగా ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ పైన ఉక్కు పాదం మోపినట్లుగా తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో మరింత పకడ్బందీగా అన్నిటిని చేపడుతామంటూ అధికారులు తెలియజేస్తున్నారు. చాలామంది యువత డ్రగ్స్ కు గంజాయికి బానిసై చెడిపోతున్నారని.. ఇది ఎక్కువగా మెడికల్ స్టోర్ లోనే లభిస్తున్నాయని విషయాలు అధికారుల వద్దకు రావడంతో ఇలా చర్యలు చేపడుతున్నారట.