
ఏపీ: విశాఖ ఉక్కు ప్లాంట్ ని అమ్మేస్తున్నారా..?
కేంద్రం మాత్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలో ఎలాంటి మార్పు లేదంటూ క్లారిటీ ఇచ్చిందట. కేవలం ఓట్ల కోసమే కూటమినేతలు జనాలని బురిడీ కొట్టించారనే వార్తలు ఇప్పుడు వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా చాప కింద నీరు లాగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణం చేసేందుకు అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా చేయి కలిపారనే విధంగా తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వాలని పబ్లిక్ గ్రీవెన్ మాజీ ఉద్యోగి పాడి త్రినాథ్ ఒక లేఖను కూడా రాశారట.
అయితే ఈ విషయం పైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు తెలియజేస్తున్నారు. అయితే ఈ విషయం పైన ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో భాగంగా ఇలాంటి విష ప్రచారం చేసే వారి పై చర్యలు తప్పవంటూ తెలియజేస్తున్నారు.. విశాఖ ఉక్కు అమ్మేస్తున్నారనే విషయం వాస్తవం కాదంటూ మరొక పోస్ట్ ఏపీ గవర్నమెంట్ చేసింది. మరి ఈ విషయం పైన అటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తారేమో చూడాలి.