ఏపీ: ఫ్రీ గ్యాస్ బుకింగ్ మొదలు.. టీడీపి కీలక ప్రకటన..!

Divya
కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా అమలు చేయడానికి ఇప్పుడు సిద్ధమయ్యింది. దీపావళి కానుకగా ఈ ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేసేలా పలు రకాల నిర్ణయాలు తీసుకుంటోంది. ఈనెల 31వ తేదీ నుంచి ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇచ్చేలా సీఎం చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారుగా ప్రతి ఏడాది 2,684 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందట. మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అంటూ అందుకే దీపం పథకం ఉన్న ప్రతి ఒక్కరి కనెక్షన్ కి ఉచిత సిలిండర్లు ఇస్తున్నామంటూ తెలిపారు.

ఇప్పటికే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఐదు హామీలను అమలు చేశామంటూ తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ను ఈనెల 31వ తేదీ నుంచి మొదలు పెట్టబోతున్నామంటూ తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఈ నెల 24వ తేదీ నుంచి ప్రతి ఒక్కరు బుక్ చేసుకోవచ్చు అంటూ తెలిపారు. అలా గ్యాస్ తీసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారులకు రెండు రోజులలోనే వారి బ్యాంకు ఖాతాలో గ్యాస్ కు సంబంధించి సబ్సిడీ డబ్బులు జమ అవుతాయని తెలిపారు.

మహిళలకు సైతం ఇంటి ఖర్చులను తగ్గించే విధంగానే ఇలాంటి ఆలోచన చేసి ఈ రెండు ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం కూడా తామే తీసుకోవచ్చామని.. అందుకే ఇప్పుడు మళ్లీ మూడు గ్యాస్ సిలిండర్ల ద్వారా ప్రజలకు మరింత మేలు చేయాలని ఆలోచిస్తున్నామంటూ తెలిపారు సీఎం చంద్రబాబు. గ్యాస్ కోసం ఉపయోగించి ఖర్చును మహిళల అవసరాలకు వాడుకోవచ్చు అంటూ తెలియజేశారు. ఒక్కో సిలిండర్ పైన 851 రూపాయలు రాయితీ ప్రభుత్వము అందిస్తుందని.. టిడిపి పార్టీ నుంచి ఒక కీలకమైన పోస్టర్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మరి ఈ రోజున క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం వీటిపైన ప్రకటించే అవకాశం ఉన్నదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: