ట్యాక్సీడ్రైవ‌ర్ ప్రియుడి కోసం లండ‌న్ నుంచి భ‌ర్త‌, పిల్ల‌ల‌ను వ‌దిలేసి హైద‌రాబాద్ వ‌చ్చిసిన ప్రియురాలు..!

RAMAKRISHNA S.S.
- ( హైద‌రాబాద్ క్రైం - ఇండియా హెరాల్డ్ )
ఆమె భ‌ర్త‌కు ల‌క్ష‌ల్లో జీతం.. లండ‌న్‌లో ఉంటారు.. ఇద్ద‌రు పిల్ల‌లు.. విలాస‌వంత‌మైన జీవితం... ఇవ‌న్నీ వ‌దిలేసుకుని హైద‌రాబాద్‌లో ఉండే ఓ ట్యాక్సీ డ్రైవ‌ర్ మాయ‌మాట‌ల‌కు ఆక‌ర్షితురాలు అయ్యి... అంద‌రిని వ‌దిలేసి హైద‌రాబాద్‌కు వ‌చ్చేసింది... ఈ ట్విస్టింగ్ స్టోరీ ఇలా ఉంది. హైద‌రాబాద్ ఆల్వాల్‌కు చెందిన ఓ జంట‌కు 17 ఏళ్ల క్రితం పెళ్ల‌య్యింది. వీరు ప్ర‌స్తుతం లండ‌న్ లో నివ‌సిస్తున్నారు. ఈ యేడాది ఫిబ్ర‌వ‌రి లో ఆమె త‌ల్లి మృతి చెంద‌డంతో ఆమె ఆస్తిక‌లు నిమ‌జ్జ‌నం చేసేందుకు లండ‌న్ నుంచి హైద‌రాబాద్ వ‌చ్చింది.

ఇక్క‌డ కిరాయికి ఓ ట్యాక్సీ మాట్లాడుకుంది.. ఆ ట్యాక్సీలోనే ఆమె తిరిగింది.. ఆ ట్యాక్సీ డ్రైవ‌ర్ కు ఆమె ఆన్‌లైన్‌లో బిల్లు ఫే చేసింది. ఆ త‌ర్వాత ఆ డ్రైవ‌ర్ ఆమె ఫోన్ పే కోసం ఇచ్చిన నెంబ‌ర్ సేవ్ చేసుకుని ఆమెతో చాట్ చేయ‌డం ప్రారంభించాడు. ఆ త‌ర్వాత మాయ మాట‌ల‌తో ఆమెను బుట్ట‌లో వేసేశాడు. ఈ సెప్టెంబ‌ర్ 16న భ‌ర్త తల్లి మృతి చెంద‌డంతో అత‌డు ఒంట‌రిగా హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. ఇక ఆ మ‌హిళ కూడా ఇంట్లో ఎవ్వ‌రికి చెప్ప‌కుండా పిల్ల‌ల‌ను వ‌దిలేసి హైద‌రాబాద్ కు ఒంట‌రిగా వ‌చ్చేసింది.

ఆ మ‌హిళ త‌న ప్రియుడు అయిన ట్యాక్సీ డ్రైవ‌ర్‌తో క‌లిసి గోవాకు వెళ్లిపోయి అక్క‌డ ఎంజాయ్ చేస్తోంది. పిల్ల‌లు అమ్మ ఇంటికి రాలేద‌ని భ‌ర్త‌కు చెప్ప‌డంతో కంగారు ప‌డ్డ అత‌డు ఫోన్ చేసినా స్పంద‌న లేదు. వెంట‌నే లండ‌న్ వెళ్లి ఆరా తీస్తే హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ట్టు తెలిసింది. ఇక్క‌డ త‌న మిత్రులు.. పోలీసుల‌ను అలెర్ట్ చేస్తే సెల్ ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా ఆమె త‌న ప్రియుడితో క‌లిసి గోవాలో ఉన్న‌ట్టు తేలింది. వెంట‌నే ఆమెను తీసుకు వ‌చ్చిన ఫ్లైట్లో లండ‌న్ పంపించి.. ట్యాక్సీ డ్రైవ‌ర్ శివ పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: