యువతకు భారీ గుడ్ న్యూస్.. కేంద్రం ప్రతినెల రూ.5000..!

Divya
కేంద్ర ప్రభుత్వం యువత కోసం నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కొత్త పథకాలు కూడా ప్రారంభిస్తూ ఉన్నది.. దీంతో యువత ఉద్యోగులను కూడా పొందేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలోనే యువతకు ప్రతినెల కొంతమేరకు ఖర్చు అవుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం రూ .5000 రూపాయల వరకు సహాయాన్ని అందించే విధంగా ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చేందుకు మార్గదర్శకాలు కూడా జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. యువత కోసం ప్రత్యేకంగా ఒక కొత్త పోర్టల్ని కూడా అభివృద్ధి చేయబోతున్నారట.

ఇంటర్న్ షిప్ స్కీం కింద 2024 బడ్జెట్లో ఈ విషయాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇందుకు  సంబంధిత సన్న హాలు కూడా చేస్తున్నారట కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేశారు. ఈ ప్లాన్ ని వచ్చే నెలలో ఎప్పుడైనా కూడా ప్రారంభించవచ్చని సమాచారం. ఈ పథకం ప్రయోజనం పొందాలి అంటే యువతకు కొన్నిటిని పాటించాలట. అయితే ఈ పథకం పొందడం కూడా చాలా కష్టం అన్నట్లుగా తెలుస్తోంది..
ఎందుకంటే ఈ పథకం కింద 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారి అర్హులట. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షలకు మించి ఉండకూడదట.. అలాగే డిగ్రీ కోర్సు లేదా ఉద్యోగానికి సంబంధించి ఇంటర్నెట్ షిప్ పథకంలో భాగంగా కాలేరు. అయితే ఆన్లైన్ కోర్సులు లేదా వృత్తి శిక్షణలో మాత్రమే పాల్గొనేలా ఉంటుందట. కార్పొరేట్ ప్రపంచ అవసరాలకు సైతం అనుగుణంగానే ఈ నైపుణ్య అభివృద్ధి ద్వారా యువతకు సైతం ఉద్యోగాలు ఉపాధి కల్పించ కార్యక్రమానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందట. ఈ సమస్త కింద చాలా కంపెనీలు కూడా ఉంటాయని యువతకు శిక్షణ ఇచ్చి మరి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ కంపెనీలు సహాయం చేస్తాయట. ఈ పథకం కింద యువతకు నెలకు 5000 రూపాయలు అందించడమే కాకుండా కంపెనీల సిఎస్ఆర్ ఫండ్ కింద 500 రూపాయలు అందించి ప్రభుత్వం నుంచి 4500 అందిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: