ఏపీ: వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊరట.. ఏం జరిగిందంటే..?

Divya
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. గతంలో తమ మీద ఇబ్బంది పెట్టిన అధికారులను నేతలను సైతల పై ప్రతికారం తీర్చుకుంటున్నారు. ముఖ్యంగా టిడిపి పార్టీ ఆఫీసుల పైన దాడి చేశారని ఆరోపణలు చాలానే వినిపించాయి. వారందరి పైన గతంలో కేసు వేసిన కూడ అధికార పార్టీ వైసిపి తీసుకోలేదనే విధంగా వినిపించాయి.. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తిరిగి మళ్ళీ ఆ కేసులను పునరువృద్ధీకరణ చేస్తున్నారు. అలా దేవినేని అవినాష్ ,జోగి రమేష్ టిడిపి ఆఫీస్ పైన దాడి చేశారని కేసు ఫైల్ చేయడం జరిగింది.

అయితే ఇప్పుడు ఈ కేసులో హైకోర్టు సైతం వీరికి కాస్త ఊరట కలిగించింది. దేవినేని అవినాష్, జోగి రమేష్ కి గతంలో ముందస్తు బయల్ని నిరాకరించింది దీంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించిన ఈ వైసీపీ నేతలకు వారి యొక్క పిటిషన్ విచారణ జరిపిన తర్వాత సుప్రీంకోర్టు వీరికి రక్షణ కల్పించాలంటూ సూచించింది. అలాగే మరొకవైపు దేవినేని అవినాష్ జోగి రమేష్ ఇద్దరూ కూడా ఈ కేసుకు సహకరించాలంటూ కోర్టు తెలియజేసింది. వీరిద్దరి పాస్పోర్టులను కూడ హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్లు సమాచారం.

వైసీపీ నేతలు తరఫున సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.. ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ లూత్ర వాదనలు వినిపించడం జరిగింది. ఈ తదుపరి కేసును నవంబర్ 4వ తేదీన వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మందస్తు బెయిల్ పై నవంబర్ 4వ తేదీన సుప్రీంకోర్టు తేల్చబోతోంది. అయితే అప్పటివరకు వీరిని అరెస్ట్ చేయడానికి వీలు లేదని ఆదేశాలు కూడా జారీ చేసింది హైకోర్టు. టిడిపి కార్యాలయం దాడి కేసులో నిందితుడిగా దేవినేని అవినాష్ ఉండగా ,జోగి రమేష్ చంద్రబాబు నివాసం పైన దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ కేసులో ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: