బాబు నివాసం కూల్చేసి శభాష్ అనిపించుకో పవన్.. అంబటి సంచలన వ్యాఖ్యలు!

Reddy P Rajasekhar
మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు సంభవించాయని అన్నారు. వరదలు వస్తే ఎలా వ్యవహరించాలనే ఆలోచన బాబుకు లేదని అంబటి పేర్కొన్నారు. కరకట్ట మునిగిపోతుందని తెలిసి కూడా అనుమతి లేని బఫర్ జోన్ లో ఉన్న ఇంట్లో చంద్రబాబు ఉంటున్నారని ఆయన కామెంట్లు చేశారు.
 
వరదలు రావడంతో బుడమేరుపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కరకట్టపై ఉన్న బాబు నివాసం కూల్చేసి పవన్ శభాష్ అనిపించుకోవాలని అంబటి తెలిపారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ అంబటి ఈ కామెంట్లు చేశారు. విజయవాడలో వరదలు తీవ్రమైన నష్టాన్ని కలిగించాయని ఆయన చెప్పుకొచ్చారు. విజయవాడలో ప్రస్తుతం పరిస్థితి దారుణంగా ఉందని అంబటి తెలిపారు.
 
ఇప్పటికీ మృతదేహాలు బయటపడుతున్నాయని జగన్ వల్లే ఇదంతా జరిగిందని చంద్రబాబు చెబుతున్నాడని అంబటి అభిప్రాయపడ్డారు. టీడీపీ సర్కార్ అసమర్థత వల్లే వరదలు సంభవించాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం సమర్థవంతంగా పని చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంబటి రాంబాబు వెల్లడించారు. ముందస్తు చర్యలు ఏం చేపట్టారో ప్రజలకు చెప్పాలని అంబటి అన్నారు.
 
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బఫర్ జోన్ లో ఉన్న కట్టడాలను తొలగించామని బుడమేరుపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. రామోజీరావు తప్పు చేస్తే చంద్రబాబు ఎందుకు శిక్షించలేదని అంబటి పేర్కొన్నారు. కృష్ణానది ఒడ్డున ఉన్నాడు కాబట్టే బాబు ఇల్లు మునిగిందని అంబటి రాంబాబు వెల్లడించారు. జగన్ విజయవాడ వచ్చిన తర్వాతే పవన్ మేల్కొన్నారని అంబటి అన్నారు. బుడమేరు అంతా ఆక్రమించారని పవన్ అంటున్నారని వారి కట్టడాలపై చర్చించాలని అంబటి కామెంట్లు చేశారు. అంబటి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: