ఏపీ: టీడీపీలో వైసీపీ అనుచరులా..ఇదేం ట్విస్ట్ ..!

Divya

తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే టిడిపిలో వైసిపి అనుచరులు ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ విదేశీ పర్యటనకు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళాడు అని, రహస్యంగా ఎందుకు వెళ్లారు అంటూ వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక ట్వీట్ ప్రత్యక్షమైంది.. ఈ ట్వీట్ చూసిన ఎవరికైనా సరే నారా లోకేష్ ఎక్కడికైనా వెళ్లాలంటే వైసిపి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి ఏమో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే గతంలో కూడా ఇలాగే ఆరోపణలు వచ్చాయి నారా లోకేష్ వ్యక్తిగత పర్యటన కోసం జర్మనీ వెళ్తే అదేదో జగన్ కోసం కుట్ర చేయడానికి వెళ్లారని వైసీపీ నేతలు ఫీల్ అయిపోయారు. ఇప్పుడు కూడా లోకేష్ వ్యక్తిగత పర్యటన కోసం వెళ్లగా ఇప్పుడు అదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే తన పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి లోకేష్ ఫ్యామిలీ తో సహా విదేశాలకు వెళ్తే వైసీపీ నేతలు ఇలా కామెంట్లు చేస్తున్నారు.అయితే దీనిని టిడిపి నేతలు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.లోకేష్ మ్యారేజ్ డే ను సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్లారు అంటూ చెబుతున్నారు మంత్రి అయినంత మాత్రాన లోకేష్ కు వ్యక్తిగత జీవితం ఉండదా అంటూ వైసీపీని ప్రశ్నిస్తున్నారు .. నారా లోకేష్ ఎవరెవరికి చెప్పి వెళ్ళాలో వారందరికీ చెప్పి వెళ్తున్నారు. మంత్రిగా ఉన్నందున ఆయన కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి కదా.. ఆ ఫార్మాలిటీస్ అన్నింటిని కూడా ఆయన పూర్తి చేశారు.

 ముఖ్యంగా వ్యక్తిగత పర్యటనల కోసం ఆయన ఒక రూపాయి కూడా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయడం లేదు. లోకేష్ ఏదో రహస్య పర్యటనలు చేస్తున్నారని ఫీల్ అయిపోతున్న వైసీపీ నేతలు.. జగన్ బెంగళూరులోనే   ఉంటున్నారు కదా.. అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్తున్నారో ఎవరికి చెప్పడం లేదు అంటూ మండిపడ్డారు. మొత్తానికైతే ఇప్పుడు ఈ విషయం కాస్త టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: