ఏపీ: ఇకపై వారి పెన్షన్ కత్తిరింపు దిశగా ప్రభుత్వం..!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పింఛన్ల విషయంలో సీరియస్ గా ఉంది. బోగస్ పింఛనుదారులను గుర్తించాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది అర్హత లేకపోయినప్పటకీ పింఛన్లు గత ఐదేళ్ల నుంచి పొందుతున్నట్లు గుర్తించారు. వీరిని పింఛనుదారుల జాబితా నుంచి తొలగించనున్నారు. గత ప్రభుత్వంలో పింఛన్ పంపిణీలో అనేక అక్రమాలు జరిగినట్లు చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అర్హత లేకపోయినా పింఛన్లు మంజూరు చేయడంతో అనర్హులు అనేక మంద పింఛన్లు పొందుతున్నారని, దీనిపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.ఏపీ ప్రభుత్వం పెన్షన లబ్దిదారుల్లో అనర్హుల గుర్తింపు పైన కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 67 లక్షల మంది వివిధ కేటగిరీల్లో పెన్షన్లు అందుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత వీరికి అందుతున్న పెన్షన్ మొత్తాన్ని పెంచి అమలు చేస్తున్నారు. అయితే, నకిలీ ధృవపత్రాలను గుర్తించే ప్రక్రియ ప్రారంభించింది.దివ్యాంగులు కొందరు నకిలీ ధృవపత్రాలతో పెన్షన్లు పొందటం పైన జిల్లాల వారీగా సమాచారం సేకరిస్తున్నారు. గత ప్రభుత్వం అనుసరించిన తనిఖీ విధానంలోనే ప్రస్తుతం ముందుకు వెళ్తున్నారు. దివ్యాంగ సర్టిఫికెట్ల జారీలోనూ పలు ప్రాంతాల్లో వేల రూపాయాలు తీసుకొని జారీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే అంశం పైన తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసారు. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం నకిలీ ధృవపత్రాలతోపెన్షన్లు అందుకుంటున్న వారి పైన ఫోకస్ చేయటంతో వారి పెన్షన్లు కోత పడటం ఖాయంగా కనిపిస్తోంది.ఏపీలో పెద్ద సంఖ్యలో పెన్షన్ లబ్దిదారులు ఉన్నారు. వీరిలో 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారు. ప్రభుత్వానికి సెర్ప్ ఇచ్చిన నివేదిక మేరకు దాదాపు 60 వేల మందికి తిరిగి వైకల్య నిర్దారణ పరీక్షలు చేయాలని తేల్చారు. కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా జూలై, ఆగస్టు నెలల్లో ఇంటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసారు. ఆ సమయంలో అనర్హులకు పెన్షన్లు అందుతున్నట్లుగా గుర్తించారు. అధికారులకు ఫిర్యాదులు చేసారు. దీంతో,వారికి నోటీసులు జారీ అయ్యాయి.ఆధార్ కార్డులో వయస్సు మార్చుకుని, వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారని గుర్తించారు. దివ్యాంగులు కాకపోయినా.. దివ్యాంగుల నకిలీ సర్టిఫికేట్ చూపించి పింఛన్లు అందుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.తాజాగా మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి సైతం భోగ సర్టిఫికెట్లు పెడితే పెన్షన్ పంపిణీకి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: