మంగళగిరి: ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం.. సాధ్యమేనా..?
అయితే ఒక ఏడాదిలోపే ఈ క్రికెట్ స్టేడియం ని అధునాతన హంగులతో నిర్మించాలని కూటమి ప్రభుత్వం ప్లాన్ వేస్తోంది. ఆంధ్ర క్రికెట్ కి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేలా పలు రకాల నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.వచ్చే రెండు సంవత్సరాలలో ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ను కూడా నిర్వహించేలా పలు రకాల ప్రణాళికలను సైతం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ స్టేడియాను నిర్మించడం సాధ్యమేనా అంటే అది చాలా కష్టమని కచ్చితంగా స్టేడియం నిర్మించాలి అంటే సుమారుగా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంతేకాకుండా సుమారుగా భూమికావలసి ఉంటుంది.. అంతటి బడ్జెట్ ఏపీ దగ్గర ఉందా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవలే ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని చిన్ని ప్రకటించడం జరిగింది. వచ్చేనెల 8వ తేదీ నుంచి బాధ్యతలు చేపట్టబోతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు హనుమ విహారిని గత ప్రభుత్వం కక్షగట్టి మరి క్రికెట్ నుండి పంపించే కుట్రలు చేశారని తెలియజేశారు. అయితే లోకేష్ మాత్రం తనని ఒప్పించి మరీ ఇక్కడికి వచ్చి ఆడేలా చర్యలు తీసుకుంటామంటూ తెలియజేస్తున్నారు. రిటైర్డ్ అయిన కొంతమంది క్రికెట్లో సహాయం తీసుకుని ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ ను అభివృద్ధి చేసే ప్రణాళికగా రూపుదిద్దుకుంటామంటూ కూటమినేతల తెలియజేస్తున్నారు. రాబోయే రోజుల్లో క్రికెట్ ఆడే వారి సంఖ్య పెరగాలని విధంగా ఆంధ్ర అసోసియేషన్ పనిచేస్తుందని తెలుపుతున్నారు కేశినేని చిన్ని.