ఏపీ: విద్యావ్యవస్థను నారా లోకేష్ ముందుకు తీసుకెళ్లాలంటే ఇలా చేయాల్సిందేనా..?
దీనివల్ల కమ్యూనికేషన్ గ్యాప్ వస్తోందట. మరొకటి ఏమిటంటే మ్యాథ్స్, సైన్స్ లాంటి వాటిలలో ఆశించినటువంటి నాలెడ్జిబుల్ సిట్యుయేషన్ లేదట. ఏదో ఒక లోపం ఉండనే ఉంటుందట. ఒకసారి కళాశాల విద్యార్థులను లేకపోతే విశ్వవిద్యాలయ విద్యార్థులను ఈ ప్రభుత్వ కళాశాలలను, పాఠశాలలను అనుసంధానం చేస్తే బాగుంటుందేమో అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వాళ్లకి టీచింగ్ ఎక్స్పీరియన్స్ రావడమే కాకుండా విద్యార్థులకు కూడా మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. చదువుకుంటున్నటువంటి పిల్లలకు వాలంటీర్ సిస్టం తరహాలో 5000 రూపాయల వరకు అలా పే చేస్తే.. వచ్చేటువంటి టీచర్లను తీసుకొని మరి చేస్తే కనుక అటు వారికి ఎక్స్పీరియన్స్ వస్తుంది పిల్లలకు కూడా మంచి కమ్యూనికేషన్ ఉంటుంది.
దీంతో యూత్ అంతా కూడా చదువుకోగలుగుతారు.. చక్కటి ఆలోచన కూడా వస్తుంది. ఏదైతే స్కూల్లో చదివేటప్పుడు వస్తున్న లోపం అయితే ఉన్నదా.. ఆ లోపాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇలాంటి ఆలోచన చేస్తే బాగుంటుందని పలువురు విద్యావంతులు సైతం తెలియజేస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో నాడు నేడు కింద స్కూళ్లను బాగు చేయడమే కాకుండా విద్యార్థులను పెంచే క్రమంలోని అడుగులు వేశారు. మరి నారా లోకేష్ మరింతగా ఏపీ లో విద్యావ్యవస్థను పటిష్టం చేస్తానంటూ తెలియజేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు తీసుకువస్తారో చూడాలి నారా లోకేష్.