గుంటూరు – విజయవాడ: మళ్లీ ఊపందుకున్న నిర్మాణాలు?

Purushottham Vinay
గుంటూరు – విజయవాడ: మళ్లీ ఊపందుకున్న నిర్మాణాలు?  

ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ తరువాత పెద్ద నగరాలైన గుంటూరు, విజయవాడ నగరాలు విభజన తరువాత దాదాపుగా కలిసిపోయాయనే సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత అమరావతిలో కంటే.. గుంటూరు, విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి పక్కన నిర్మాణాలు చాలా స్పీడ్ గా జరిగాయి.పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కూడా తమ ప్రాజెక్టులు ప్రారంభించాయి. కానీ వాటికి 2019 వ సంవత్సరంలో సమస్య వచ్చింది. నిర్మాణాలు కొనసాగిస్తే కొంటారా లేదా అన్న విషయం కాదు కానీ ఏదోక రూల్ పెట్టి కూల్చేస్తారన్న భయంతో ఆపేశారు. ఫలితంగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా నిర్మాణాలు ఆపేసి పారిపోయాయి. కొన్ని వేల కోట్ల సంపద అలా.. అక్కడ అడవిలా మారిపోయింది.అయితే ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మళ్లీ కళ ప్రారంభమయింది. తమ ప్రాజెక్టుల్లో పెద్ద పెద్ద కంపెనీలు ఈ అడవుల క్లియరెన్స్ ప్రారంభించాయి. 


పిచ్చి మొక్కలని తొలగించి మళ్లీ ఆకర్షణీయంగా చేసుకుని నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించేందుకు రెడి అయ్యాయి. వచ్చే ఒకటి, రెండు నెలల్లో దాదాపుగా అన్ని భారీ ప్రాజెక్టులు మళ్లీ ఊపందుకునే ఛాన్స్ బాగా ఉంది. ఆ నిర్మాణాలు ప్రారంభమైతే ఇక ఆ జోరు ఆపడం కష్టమే అన్నట్లుగా పరిస్థితి మారింది. విజయవాడ – గుంటూరు మధ్య హైవేకు రెండు వైపులా అతి పెద్ద వ్యాపార కేంద్రాలకు పుష్కలంగా అవకాశం ఉంది.గతంలో చాలా రకాల సంస్థలు కూడా తమ ప్రాజెక్టులను సిద్ధం చేసుకోవడం జరిగింది. కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశాలు కూడా వచ్చి పడ్డాయి.. కానీ ఐదేళ్ల పాటు వారంతా కూడా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అమరావతిలో ప్రభుత్వం జంగిల్ క్లియరెన్స్ ని నిర్వహిస్తోంది. అది పూర్తయిన వెంటనే నిర్మాణాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక ప్రభుత్వ పరంగా నిర్మాణాలు అనేవి ప్రారంభిస్తే.. ప్రైవేటు ప్రాజెక్టులు కూడా ఊపందుకునే అవకాశం పుష్కలంగా ఉంది. మరి చూడాలి. ఏమవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: