పెద్దిరెడ్డికి అంబానీ రేంజ్‌ ఆస్తులు..1000 ఏళ్లు కూర్చొని తినొచ్చు ?

Veldandi Saikiran
వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి తెలియని వారుండరు. అయితే.. పెద్దిరెడ్డికి అంబానీ రేంజ్‌ ఆస్తులు ఉన్నాయట..1000 ఏళ్లు కూర్చోని తినే అంతగా ఆస్తులు ఉన్నాయట. అయితే.. ఈ విషయాన్ని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న తాజాగా మీడియాతో మాట్లాడుతూ.... పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి సొంత నియోజకవర్గంలోకి అడుగు పెట్టడానికి బయపెడుతున్నారని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలోకి వెళ్లలేని వాళ్ళు.... కుప్పం చంద్రబాబును, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తామని శపథం చేశారని చురకలు అంటించారు.

చంద్రబాబు ఎన్నికలో బాగా ఫోకస్‌ చేస్తే వైసీపీ 9 సీటు మాత్రమే వచ్చేవని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న. పుంగనూరుకు చంద్రబాబు వచ్చినప్పుడు అల్లరి ముఖలతో ఎలా దాడి చేశారని ప్రశ్నించారు.  పెద్దిరెడ్డి, మిథున్‌ రెడ్డి గనులను సొంత మనుషులు మీద రాపించాడని.. వారిందరికీ డబ్బుపైన ఆశ బాగా ఉందని తెలిపారు. పెద్దిరెడ్డికి బాగా గనులు ఉన్నాయని తెలిపారు.  అందుకే అప్పటి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం లో ఆ శాఖను పెద్దిరెడ్డికి అప్పచెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న.  

జగన్ మోహన్ రెడ్డి కి అనుభవం లేని మనిషి అని..... ఏదైతే గనుల శాఖలో కొట్లు సంపాదించుకోవడానికి దొంగ చేయికి తలలు ఇచ్చాడని చురకలు అంటించారు. పుంగనూరులో దోచుకున్న సంపదను ప్రజలకు ఇచ్చే యండంటూ  వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫైర్‌ అయ్యారు. పుంగనూరు ప్రజలు మిమల్ని క్షమించబోరన్నారు. 1000 సంవత్సరాలు సరిపడా ఆస్తులు సంపాదించారని ఆరోపణలు చేశారు.  పుంగనూరు ప్రజలే వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని నియోజకవర్గంకు రానివ్వడం లేదని ఎద్దేవా చేశారు. ఇక లోకేష్ రెడ్ బుక్ చూస్తేనే మీరు బయపడుతున్నారని... అదే రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మీ పరిస్థితి ఏంటి అంటూ హెచ్చరించారు బుద్దా వెంకన్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: