ఏపీ: ముద్రగడపై ప్రశంసలు కురిపించిన మాజీ మంత్రి..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ముద్రగడ పద్మనాభం గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఇటీవలే వైసిపి పార్టీ ఓడిపోవడంతో ముద్రగడ పద్మనాభ రెడ్డి గా తన కొత్త పేరును మార్చుకున్నారు.. పవన్ కళ్యాణ్ ను పిఠాపురంలో ఓడిస్తామని సవాలు చేసి ఈ సవాల్  కు ఓడిపోతే తన పేరు మార్చుకుంటాను అంటూ ఒక ప్రతిజ్ఞ చేశారు. అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవడంతో తన పేరును పద్మనాభ రెడ్డి గా మార్చుకొని ఒక సంచలనాన్ని సృష్టించారు.. అయితే ఆయన అభిమానించే మాజీమంత్రి అంబాటి రాంబాబు నిన్నటి రోజున గుంటూరు నుంచి తూర్పుగోదావరి జిల్లా కి రావడం జరిగింది.

అధికారికంగా ముద్రగడ తన పేరును మార్చుకున్న తర్వాత కలుద్దామని చాలాసార్లు అనుకున్నప్పటికీ అది కుదరడం లేదు.. కానీ ఇప్పుడు మీడియా ముందే కలవడం జరిగింది అంటూ తెలిపారు.. రాజకీయాలలో సవాల్ చేసి పారిపోయేవారు ఉన్నారు కానీ మాటమీద నిలబడి చేయాలనుకునేవారు ఎక్కడా చూడలేదని తెలిపారు అంబటి రాంబాబు.. కాపులను వాడుకొని ముద్రగడ ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేదని ముద్రగడ కులంలో తాను పుట్టిన కులంలో పేదలకు న్యాయం చేయడం కోసమే చాలా పోరాటాలు చేశారని తెలిపారు అంబాటి..

కాపునాడు మొదటి సభలో పాల్గొనేందుకు ముద్రగడ తన అధికారిక పదవులను సైతం వదులుకున్నారని ఆయనలాంటివారు ఎవరు ఉండబోరని కూడా తెలియజేశారు. చంద్రబాబు కాపులను బీసీల చేరుస్తానంటూ హామీలు ఇచ్చారని.. అలా చేయని యెడల ముద్రగడ చేపట్టిన కాపుల ఉద్యమం పెద్ద ఎత్తున వైరల్ గా మారింది దీని వెనుక ముద్రగడ నిజాయితీ నిబద్ధత మాత్రమే ఉన్నదని తెలిపారు. రాజకీయాల కంటే ముందుగానే ముద్రగడతో తన పరిచయం ఉందని గుర్తు చేశారు అంబాటి రాంబాబు. ముద్రగడ రాజకీయాలలోకి వచ్చి తమ సామాజిక వర్గం కోసం ఎన్నో చేయాలని చాలా నష్టపోయారని తెలిపారు. అయితే ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరాల్సి ఉండగా ఎందుకో చేరలేదు.. ఒకవేళ చేరి ఉంటే ఆయనకు పదవులు వచ్చేవేమో అని భావన కూడా ఉన్నది.. 2009లో చివరిసారిగా పోటీ చేశారు. 2019లో వైసీపీ పార్టీలో చేరుతారు అనుకున్నారు కానీ కొన్ని కారణాల చేత దూరమయ్యారు.. వాస్తవానికి ముద్రగడ ఉపముఖ్యమంత్రి స్థాయిలో ఉండవలసిన నేత అని ఆయన అభిమానులు తెలియజేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: