కేసు రెడీ... పోలీసులు రెడీ... వంశీ ఎక్కడున్నావమ్మా...?
- అరెస్టు అయిన వారిలో వంశీ డ్రైవర్ కూడా..?
- వంశీ ఎక్కడున్నావమ్మా అంటూ టీడీపీ సెటైర్లు
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కనిపించడం లేదు. కానీ ఆయనపై ఒక కేసు రెడీ అయిపోయిన వాతావరణమే కనిపిస్తోంది. వంశీ నియోజక వర్గం అయిన గన్నవరంలో కొత్త డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారి గతంలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసును ఇప్పుడు తిరిగి ఓపెన్ చేశారు. అప్పట్లో వంశీ గ్యాంగ్ దగ్గరుండి మరీ ఈ దాడి చేయించినట్టు టాక్ నడిచింది. ఈ కేసులో అప్పటి పోలీసులు టీడీపీ వాళ్లను అరెస్టు చేశారు. అప్పుడు వంశీ వైసీపీ తో అంట కాగడంతో ఆయన ఏం చెపితే పోలీసులు విని అదే చేశారు.
ఈ కేసు లోనే టీడీపీ కీలక నేత కొమ్మారెడ్డి పట్టభిరాంను అరెస్టు చేసి ధర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారు. ఇప్పుడు కాలం మారింది... ఇప్పుడు ప్రభుత్వం మారింది.. పోలీసులు మారారు. అప్పట్లో వంశీయే ప్లాన్ చేసి మరీ దగ్గరుండి టీడీపీ ఆఫీస్ పై ఈ దాడి చేయించారన్న ప్రచారం జరిగింది. ఈ కేసులో దూకుడు కూడా మామూలుగా లేదు. కొత్త డీఎస్పీ సీసీ టీవీ ఫుటేజీ , మీడియా వీడియోలు చూసి పదిహేను మందిని అరెస్టు చేయగా.. ఇందులో వంశీ డ్రైవర్ కూడా ఉన్నారు.
పైగా ఈ దాడి తర్వాత వంశీ గ్యాంగ్ సైతం మీడియా తో అంటే టీవీ 9 తో మాట్లాడుతూ… తామే దాడి చేశామని గొప్పగా చెప్పుకున్నారు కూడా. వంశీ అడ్డంగా దొరికే కేసుల్లో ఇదొకటి కావడంతో ఇప్పుడు వంశీ కోసం వెతుకుతున్నా రు పోలీసులు . ఇప్పటికే టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడికేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. ఇక గన్నవరం డీఎస్పీ తన పవర్ను నిరూపించుకునేందుకు రెడీ అవుతన్నారు. ఇంత జరుగుతున్నా వంశీ అడ్రస్ దొరకడం లేదు.. వంశీ ఇక్కడే ఉండి ఉంటే అసలు కథ స్టార్ట్ అవుతుంది.