ఏపీ: నిరుపేద మహిళకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన డిప్యూటీ సీఎం..!

Divya
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలలో పిఠాపురంలో భారీ విజయాన్ని సాధించారు. చాలామంది సెలబ్రిటీలు వచ్చి ప్రచారం చేయడమే కాకుండా అభిమానులు కూడా దేవుళ్లకు పూజలు చేసి మరి మొక్కడం జరిగింది. పదేళ్లుగా ప్రజల కోసం కష్టపడుతూ తన విలాసవంతమైన జీవితాన్ని వదిలి మరి ప్రజల కష్టాలు తీర్చాలని కోరికతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసారి గట్టి విజయాన్ని అందుకున్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తనని గెలిపించండి మీ భవిష్యత్తు మారకపోతే చూడండి అంటూ ప్రజలను కూడా ఆకట్టుకోవడం జరిగింది.

ఇక ఓటర్లు సైతం ఒకటి రెండు కాదు దాదాపుగా 70 వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిపించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి నిలబడిన 21 అసెంబ్లీ అభ్యర్థులను 2 పార్లమెంట్ అభ్యర్థులను కూడా భారీ మెజార్టీతోని గెలిపించిన తీరు పవన్ కళ్యాణ్ కి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో మరియమ్మ అనే మహిళ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచిందని చెప్పవచ్చు.. పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఒక రిక్షా కార్మికుడు సైతం తన భార్య మరియమ్మ తన భర్త తెచ్చిన రిక్షా తొక్కుతూ ఆ సొమ్ముతో ఊరంతా పవన్ కళ్యాణ్ గెలిస్తే పండగ చేస్తానంటూ కూడా తెలియజేసింది.

అయితే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఒకరోజు రిక్షా తొక్కగా వచ్చిన డబ్బులతో స్వీట్లు కొని ఆ చుట్టుపక్కల వారందరికీ కూడా పంచినట్లు సమాచారం. ఈ విషయం పవన్ కి తెలియగానే చలించిపోయి మరి ఆ కుటుంబానికి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా అందించారు.. జనసేన సైనికులు ఆ కుటుంబానికి ఆటో బహుమానంగా ఇచ్చి వారి సంతోషాన్ని సైతం పంచుకున్నారు.. ఈ విషయం పైన అటు మరియమ్మ ఆమె భర్త ఆనందాన్ని తెలియజేస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. తన భర్త 20 ఏళ్లుగా రిక్షా తొక్కుతున్నారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆటో అందించడం తనకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది అంటూ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: