ఏపీ: జగన్ వల్ల అడ్డంగా బుక్కవుతున్న మాజీ మంత్రి ...!

FARMANULLA SHAIK
వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు క్లారిటీ వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. బొత్స సత్యనారాయణ వైసీపీ అధికారంలో ఉన్నపుడు జగన్ తో సన్నిహితంగా ఉన్న మంత్రులలో ఒకరు. ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఆయనకు ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఎక్కువగా టికెట్లు ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీలో బొత్స హావా ఒక లెవెల్ లో సాగింది.అయితే 2019లో వైసీపీని విజయనగరం జిల్లాలో టోటల్ గా గెలిపించి క్లీన్ స్వీప్ చేయించిన బొత్స 2024లో తనతో పాటు జిల్లాలో వైసీపీ ఓడిపోయినా ఏమీ చేయలేకపోయారు. ఇది రాజకీయ మహిమ. ఆనాడు వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తే 2024లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. దాంతో బొత్స కూడా ఎన్నికల ఫలితాల మీద షాక్ కి గురి అయ్యారు.ఆ తరువాత ఆయన సైలెంట్ అయిపోయారు. అసలు బొత్స ఉన్నారా లేరా అన్నట్లుగానే కాలం సాగింది. ఏపీలో ఈ మధ్య కాలంలో ఏమి జరిగినా బొత్స నుంచి రియాక్షన్ ఏమీ లేదు. కానీ ఆదివారం ఆయన తీరిక చేసుకుని మీడియా ముందుకు వచ్చారు.
ఏపీలో గత ఇరవై రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను ఎంతగానో కలత చెందేలా చేశాయని ఆయన అంటున్నారు. ప్రజాస్వామ్య విధానాలు ఎక్కడా అమలు కావడం లేదని అంటున్నారు. వీసీలను రాజీనామాలు చేయమని కోరడమేంటని ప్రశ్నించారు. వారిని గవర్నర్ నియమిస్తారని ఆయన అన్నారు.బొత్స సత్యనారాయణ టెన్షన్‌కు గురవుతున్నారు. తనకు కనీసం ఇంగ్లిష్ కూడా రాకపోయినా పెద్దగా చదువు లేకపోయినా విద్యాశాఖ ఇచ్చి తన పేరు మీద పెద్ద ఎత్తున జగన్ గ్యాంగ్ దోపిడీ చేసిందని ఇప్పుడు తాను అడ్డంగా ఇరుక్కుటున్నానని ఆయన ఫీలవుతున్నారు.అందుకే తరచూ ప్రెస్ మీట్లు పెట్టి.. పరోక్షంగా తనకే సంబంధం లేదని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారుఏపీలో వరుసగా వీసీలు రాజీనామాలు చేస్తున్నారు. వారిని వైస్ చాన్సలర్లు అనడం కంటే.. వైసీపీ కార్యకర్తలు అనడం కరెక్ట్. వారిలో చాలా మంది పెద్ద ఎత్తున డబ్బులు చెల్లించి పోస్టులు తెచ్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పోస్టు కూడా ఊడింది కాబ ట్టి తమ డబ్బుల సంగతేమిటని.. బొత్సపై ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన .. వీసీలను రాజీనామా చేయించడం కరెక్ట్ కాదని ప్రెస్మీట్ పెట్టేశారు. మరి వీసీలు చేస్తోంది కరెక్టా అంటే.. నీళ్లు నములుతున్నారు.
విద్యాశాఖలో బైజూస్, టోఫెల్, ఐబీ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. ఇదంతా బయటకు తీస్తున్నారు. ఈ సమాచారం బొత్స సత్యనారాయణకు ఉంది. అందుకే గతంలో ఉన్నట్లుగా లేనని.. టీడీపీని ఏమీ అననని చెప్పడం ప్రారంభించారు. కానీ అమరావతిపై కుల ముద్ర వేసి అనుచిత వ్యాఖ్యలు చేయడంలో బొత్సనే ముందున్నారు. ఆయనను వదిలి పెట్టే అవకాశం ఉండదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.అయితే బొత్స మీద ఇప్పటిదాకా రకరకాలైన ప్రచారం సాగింది. ఆయన టీడీపీ వైపు చూస్తున్నారని అలాగే జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజమెంతో తెలియదు కానీ బొత్స వైసీపీలోనే కొనసాగుతారు అన్నది క్లారిటీ వచ్చింది అని అంటున్నారు. టీడీపీలో సీనియర్లకు మెల్లగా పక్కకు జరగమని సూచిస్తున్నారు. జనసేన అయితే కొత్త వారితోనే ముందుకు సాగాలని చూస్తోంది. దీంతో సీనియర్ నేతలుగా ఉన్న వైసీపీ వారికి ఎక్కడా ప్రస్తుతానికి అయితే ఆఫర్లు లేవని అంటున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో వైసీపీ సీనియర్ల రాజకీయం ఎలా ఉంటుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: