బీజేపీ: చిన్నమ్మకు చెక్ పెడుతోంది ఎవరు..?

Divya
కేంద్ర మాజీ మంత్రి బిజెపి ఆంధ్ర ప్రదేశ్ ప్రెసిడెంట్గా పేరుపొందిన దగ్గుబాటి పురందేశ్వరి.. కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడుకి బాగా సపోర్టివ్ చేసింది. దీంతో పురందేశ్వరి కచ్చితంగా కేంద్రమంత్రి అవుతుందని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా రాజమండ్రిలో భారీ మెజారిటీతో గెలిచింది. కానీ కేబినెట్లో ర్యాంకుతో మంచి శాఖ ఇస్తారు అనుకున్న సమయానికి తీరా అనూహ్యంగా ఈమెకు బదులుగా ఇతర పేర్లు వినిపించాయి. బిజెపి నుంచి నరసాపురం ఎంపీగా శ్రీనివాస వర్మాను తీసుకోవడం జరిగింది. అలా పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి కూడా తప్పకుండానే పోయింది.

దీంతో మరో కొత్త ప్రచారం కూడా తెరపైకి వచ్చింది ఈమెను స్పీకర్గా ఎంపిక చేయడానికి ఇదంతా జరిగిందని వార్తలు వినిపించాయి. అయితే గత పది రోజులుగా ఈ ప్రచారం వినిపించినప్పటికీ సౌత్ ఇండియాకు ఈసారి ప్రాధాన్యత ఇస్తారని అందులో పురందేశ్వరి పేరు ఉంటుందనే విధంగా వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఈమె స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె కావడంతో కేంద్ర మంత్రిగా పనిచేసే అనుభవం కూడా ఉందని అందరూ అనుకున్నారు.. కానీ ఐదేళ్లపాటు స్పీకర్ గా పనిచేసే అవకాశం ఓం బిర్లాకే అవకాశం లభించింది.

అయితే ఈమెకు పదవులు రాకుండా తెర వెనుక ఎవరో చక్రం తిప్పుతున్నారని విషయం ఇప్పుడు తెరమీదికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో బిజెపిలోనే ఆమెకు గిట్టని వారు ఉన్నారని ఇదంతా వారే చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.బిజెపి పెద్దలు మాత్రం పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన స్వచ్ఛమైన బిజెపి నేతలకే పదవులు ఇస్తున్నారు అనే విధంగా పదవులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారి సేవలను కేవలం ఉపయోగించుకుంటున్నారని సమాచారం. ఇప్పుడు బిజెపికి సొంత మెజారిటీ లేనందు వల్ల పార్టీ బలంగా ఉండాలని ఆలోచనతోనే మొదటి నుంచి ఉన్నవారికి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణలో ఈటెల రాజేందర్ కి కూడా కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు. కేవలం కిషన్ రెడ్డికి బండి సంజయ్ లకు మాత్రమే పదవులు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: