ఏపీ: తల్లి మాటను ఫాలో అవుతున్న టిడిపి ఎంపీ..!
దేశంలోనే చాలా కీలకమైన శాఖలలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఈ శాఖను మరింత ఎత్తున విస్తరింప చేస్తానని తెలిపారు రామ్మోహన్ నాయుడు.. అలాగే విమాన చార్జీలను సైతం అందుబాటులోకి తీసుకురావడమే తమ ముందు ఉన్న లక్ష్యం అంటూ కూడా తెలిపారు. కరోనా తర్వాత విమాన చార్జీలు పెరిగిన నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు తాను చేయవలసిన ప్రయత్నాలు అన్నీ కూడా చేస్తానని తెలిపారు. తాజాగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తన చెల్లి చెప్పిన మాటను తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రిగా బాధ్యతలు స్వీకరణకు ముందు ఒక తెల్ల కాగితం మీద తెలుగులో ఓం శ్రీ రామ్ అంటూ 21సార్లు రాయాలని తన తల్లి కోరిందట. ఆ తర్వాతే కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని చెప్పడంతో మొదట అలా చేసిన తర్వాతే తన ఫైలు మీద సంతకం చేయాలని చెప్పిందట.. అందుకు తగ్గట్టుగానే రామ్మోహన్ నాయుడు కూడా ఫాలో అవ్వడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.కేంద్ర మంత్రి అయినా సరే అమ్మ కొడుకే కదా అంటూ పలువురు నేతలు కార్యకర్తలు సైతం తెలియజేస్తున్నారు. అమ్మ చెప్పిన తర్వాత ఎవరైనా చేయకుండా ఉంటారా అంటూ మరి కొంతమంది తెలియజేస్తున్నారు.మరి రాబోయే రోజుల్లో విమాన చార్జీలు సైతం తగ్గిస్తారేమో చూడాలి.